కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ బాధితులకోసం కరీంనగర్లో ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రారంభించారు. పలు మండలాల్లో పేదలకు నిత్యావసర సరకులు, అన్నదానం, మాస్కులు అందించారు.
ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతం చేసేందుకు మోదీ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడేళ్ల సుధీర్ఘ పాలనలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు అమలు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ సంక్షోభంలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. లాక్డౌన్తో పాటు కీలక అంశాలపై చర్చ