కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులను ఎవరూ ఆపలేరని.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ నిధుల విషయంలో కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్రావు, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతితో కలిసి స్మార్టు సిటీ పనులను పరిశీలించారు.
తాము ప్రజాసమస్యల పరిష్కారంలో ముందువరుసలో ఉంటామన్నారు. అభివృద్ధి మాత్రమే తెరాస నినాదమని స్పష్టం చేశారు. కరీంనగర్లో ఐఐఐటీ విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. నగర అభివృద్ధి పనులను వేగవంతంగా చేయిస్తున్న కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ క్రాంతిని అభినందించారు.. వినోద్కుమార్.
ఇవీచూడండి: కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ