ETV Bharat / city

రేపు మద్యం దుకాణాలకు లాటరీ... - మద్యం లాటరీ ప్రక్రియ

రేపు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు.

మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Oct 17, 2019, 8:00 PM IST


మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను రేపు కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం లిక్కర్ వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. రాష్ట్రవ్వాప్తంగా 2,216 మద్యం దుకాణాల కోసం 48,401 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు రుసుముల ద్వారానే ప్రభుత్వానికి రూ.968.02కోట్ల ఆదాయం వచ్చినట్లు అబ్కారీ కమిషనర్​ రవిప్రకాశ్ తెలిపారు.

అత్యధిక దరఖాస్తులు ఇక్కడి నుంచే...

మద్యం దుకాణాల కోసం అత్యధికంగా రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్‌ నుంచి 8,892 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ కమిషనర్ తెలిపారు. వరంగల్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ నుంచి 8,101 దరఖాస్తులు వచ్చి రెండో స్థానంలో నిలిచింది. రేపటి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.


మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను రేపు కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం లిక్కర్ వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. రాష్ట్రవ్వాప్తంగా 2,216 మద్యం దుకాణాల కోసం 48,401 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు రుసుముల ద్వారానే ప్రభుత్వానికి రూ.968.02కోట్ల ఆదాయం వచ్చినట్లు అబ్కారీ కమిషనర్​ రవిప్రకాశ్ తెలిపారు.

అత్యధిక దరఖాస్తులు ఇక్కడి నుంచే...

మద్యం దుకాణాల కోసం అత్యధికంగా రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్‌ నుంచి 8,892 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ కమిషనర్ తెలిపారు. వరంగల్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ నుంచి 8,101 దరఖాస్తులు వచ్చి రెండో స్థానంలో నిలిచింది. రేపటి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

TG_HYD_53_17_LADY_SUICIDE_PKG_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ TG_HYD_34_17 ఫైల్ లో వచ్చిన విజువల్స్, బైట్ వాడుకోగలరు. ( ) బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఆత్మహత్య పాల్పడ్డారు. పైఅధికారి, తోటి ఉద్యోగుల వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.....LOOK V.O- బీహెచ్ఈఎల్ లో పనిచేస్తున్న నేహా అనే ఉద్యోగిని హఫీజ్ పేట్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నేహా ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. ఆమె భర్త సునీల్ ఇంటికి వచ్చి చూసే సరికి నేహా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. వెంటనే కిందికి దించి చూడగా అప్పటికే నేహా మృతి చెందినట్లు నిర్దారించారు. నేహా చనిపోయే ముందు సూసైడ్ నోట్ ను రాసిపెట్టారు. తన చావుకు బీహెచ్ఈఎల్ లోని ఏజీఎం తో పాటు తోటి ఉద్యోగులు 5 గురు కారణమని లేఖలో పేర్కొన్నారు. గత రెండు నెలలుగా మానసికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు... డీజీఎం లైంగికంగా వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని సూసైడ్ నోట్ లో ఆరోపించారు. బోపాల్ లోని బీహెచ్ఈఎల్ లో పనిచేస్తూ బదిలీపై జూన్ లో ఇక్కడికి వచ్చిన నేహా భర్తతో కలిసి హఫీజ్ పేట్ లో నివాసం ఉంటున్నారు. బోపాల్ లో పనిచేసే సమయంలోనూ ఐదుగురు ఉద్యోగులు వేదింపులకు గురిచేసినట్లు నేహా లేఖలో స్పష్టం చేశారు. బదిలీపై ఇక్కడికి వచ్చినా కూడా.. బోపాల్ బీహెచ్ఈఎల్ ఉద్యోగులు... ఇక్కడికి ఉద్యోగులకు తన గురించి చెడుగా చెప్పారని నెహా లేఖలో చెప్పుకొచ్చారు. దీంతో ఇక్కడి ఉద్యోగులు వేదింపులకు గురిచేశారని లేఖలో ఆరోపించారు. .....BYTE సునీల్‌, నెహా భర్త V.O - భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తన చరవాణిని డీజీఎంతో పాటు... తోటి ఉద్యోగులు హాక్ చేశారని... మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నేహా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిందిగా మియాపూర్ పోలీసులు సూచించడంతో... ఆ మేరకు నేహా ఈ నెల11న సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేహా తన స్మార్ట్ ఫోన్ కెమెరాకు తెల్లటేపు వేసి.... సాధారణ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో పాటు... నేహా మానసిక స్థితి గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. E.V.O- నేహా తన సూసైడ్ నోట్ లో రాసిన వాళ్ల పేర్లను సేకరించిన పోలీసులు.... ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.