ETV Bharat / city

తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత - paddapally latest news

కౌలురైతులకు న్యాయం చేసేందుకు పెద్దపల్లి జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. దళారీల ఆగడాలను అరికట్టేందుకు తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. విషయం తేలియక పెద్దపల్లి జిన్నింగ్​ మిల్లు వద్ద ఉన్న సీసీఐ కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు.

cotton buying was stop temporarily
తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత
author img

By

Published : Feb 27, 2020, 11:44 AM IST

దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. కౌలు రైతుకు చెందిన పత్తి కొనుగోళ్లను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విషయం తెలియక బుధవారం ఉదయం సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి తీసుకొచ్చిన కౌలు రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో.. గత కొంతకాలంగా దళారులే పత్తిని విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఫలితంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ బుధవారం నుంచి తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మిల్లు వద్దే నిరీక్షణ..

బుధవారం ఉదయం సీసీఐ కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో పత్తిని అమ్మకానికి తీసుకువచ్చారు రైతులు. కానీ అక్కడి వ్యాపారులు, అధికారులు పత్తి కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. బుధవారం సాయంత్రం వరకు కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించారు.

అదనపు కలెక్టర్ వివరణ

ఈ విషయమై అధికారుల వివరణ కోరగా.. దళారుల నుంచి కౌలురైతులను రక్షించేందుకు కొనుగోళ్లు నిలిపివేశామని తెలిపారు. మరో వారం పదిరోజుల్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ తెలిపారు. కౌలు రైతులకు న్యాయం చేస్తామని.. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. కౌలు రైతుకు చెందిన పత్తి కొనుగోళ్లను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విషయం తెలియక బుధవారం ఉదయం సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి తీసుకొచ్చిన కౌలు రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో.. గత కొంతకాలంగా దళారులే పత్తిని విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఫలితంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ బుధవారం నుంచి తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మిల్లు వద్దే నిరీక్షణ..

బుధవారం ఉదయం సీసీఐ కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో పత్తిని అమ్మకానికి తీసుకువచ్చారు రైతులు. కానీ అక్కడి వ్యాపారులు, అధికారులు పత్తి కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. బుధవారం సాయంత్రం వరకు కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించారు.

అదనపు కలెక్టర్ వివరణ

ఈ విషయమై అధికారుల వివరణ కోరగా.. దళారుల నుంచి కౌలురైతులను రక్షించేందుకు కొనుగోళ్లు నిలిపివేశామని తెలిపారు. మరో వారం పదిరోజుల్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్​ లక్ష్మీనారాయణ తెలిపారు. కౌలు రైతులకు న్యాయం చేస్తామని.. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.