Duvvada Comments on Achennaidu: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైయస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 'ఆహుతి' సినిమాలో విలన్ను ఎలాగైతే ఈడ్చి ఈడ్చి కొట్టారో అలాగే అచ్చెన్నాయుడును కూడా అలా కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్ను కాదంటూ ధ్వజమెత్తారు.
మహానాడులో ఇష్టానుసారం మాట్లాడిన వారికి ఇదే తాను చేస్తున్న హెచ్చరిక అంటూ దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్పై హద్దులు మీరి, పరిధులు దాటి మాట్లాడే వారికి ఇదే హెచ్చరిక అన్నారు. జగన్ కోసం ప్రాణాలు అర్పించడానికి ఆత్మాహుతి దళంగా మారిపోతానన్నారు. తనకు ప్రాణాలపై భయం లేదని, జీవితంపై ఆశ లేదని, ఎవర్నీ విడిచిపెట్టనని స్పష్టం చేశారు.
"ఆహుతి సినిమాలో విలన్ను ఈడ్చి ఈడ్చి కొట్టినట్లు కొట్టారో అలాగే టెక్కల్ రోడ్డుపై మిమ్మల్నీ దొర్లించి కొడతా. మా జగనన్న గురించి ఇష్టానుసరంగా, హద్దులు మీరి మాట్లాడారు. జగనన్న కోసం ఆత్మాహుతి దళంగా మారడానికైనా సిద్ధం. నిన్ను రాజకీయ పతనం చేయడమే నా ఆశయం." -దువ్వాడ శ్రీనివాస్, వైకాపా ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: సిద్ధూ హత్యకు తిహాడ్ జైలులో కుట్ర!.. న్యాయ కమిషన్తో దర్యాప్తు