ETV Bharat / city

ఏపీలో జగన్ రూల్ ఆఫ్ లా ప్రత్యేకంగా తెచ్చారా?: యనమల

ఆంధ్రప్రదేశ్​లో తెదేపా నాయకులను గృహనిర్బంధం చేయడాన్ని ఆ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

author img

By

Published : Oct 31, 2020, 4:41 PM IST

yanamala-fires-on-ysrcp-govt-over-tdp-leaders-hosue-arrest
ఏపీలో జగన్ రూల్ ఆఫ్ లా ప్రత్యేకంగా తెచ్చారా?: యనమల

"ఏపీలో చట్టబద్ధ పాలన ఉందా? లేక జగన్ రూల్ ఆఫ్ లా’’ ప్రత్యేకంగా తెచ్చారా అని శాసనసమండలి ప్రతిపక్ష నేత యనమల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అణచివేత ఏపీలో ఉందని మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్న యనమల.. రాజ్యాంగ హక్కులను హరించివేశారని ఆరోపించారు. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదని.. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని పేర్కొన్నారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని యనమల అన్నారు. వైకాపా రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

"ఏపీలో చట్టబద్ధ పాలన ఉందా? లేక జగన్ రూల్ ఆఫ్ లా’’ ప్రత్యేకంగా తెచ్చారా అని శాసనసమండలి ప్రతిపక్ష నేత యనమల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అణచివేత ఏపీలో ఉందని మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్న యనమల.. రాజ్యాంగ హక్కులను హరించివేశారని ఆరోపించారు. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదని.. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని పేర్కొన్నారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని యనమల అన్నారు. వైకాపా రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.