ETV Bharat / city

బొగ్గు ఉత్పత్తి కన్నా.. కార్మికుల ప్రాణాలే ముఖ్యం: సింగరేణి సీఎండీ - సింగరేణి భవన్​లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి కన్నా.. కార్మికుల ప్రాణాలు, వారి ఆరోగ్య రక్షణే తమకు ముఖ్యమని సింగరేణి సీఎండీ శ్రీధర్​ స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో శ్రీధర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

singareni cmd sridhar
బొగ్గు ఉత్పత్తి కన్నా.. కార్మికుల ప్రాణాలే ముఖ్యం: సింగరేణి సీఎండీ
author img

By

Published : Aug 15, 2020, 7:27 PM IST

ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కన్నా.. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్య రక్షణే ముఖ్యమని సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తి 50 శాతం తగ్గిందని తెలిపారు. పరిస్థితులు చక్క బడిన తర్వాత బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలమన్నారు. కార్మికులకు కరోనా పరీక్షలు, చికిత్సల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీధర్ వివరించారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో శ్రీధర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి భవన్​లో మెడికల్ సూపరింటెండెంట్​లు బి.శివకుమార్, బాలకోటయ్య, కో ఆర్డినేటర్​ను.. సత్కరించారు.

ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కన్నా.. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్య రక్షణే ముఖ్యమని సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తి 50 శాతం తగ్గిందని తెలిపారు. పరిస్థితులు చక్క బడిన తర్వాత బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలమన్నారు. కార్మికులకు కరోనా పరీక్షలు, చికిత్సల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీధర్ వివరించారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో శ్రీధర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి భవన్​లో మెడికల్ సూపరింటెండెంట్​లు బి.శివకుమార్, బాలకోటయ్య, కో ఆర్డినేటర్​ను.. సత్కరించారు.

ఇవీచూడండి: యాక్టివ్‌ కరోనా కేసులు 6.6 లక్షలే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.