జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తటంతో కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావల్సి ఉండగా ఈరోజుకు వాయిదా పడింది.