ETV Bharat / city

తేమగాలుల వల్ల రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు - weather report on wednesday in telangana

ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమగాలులతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం పగలు రామగుండంలో అత్యధికంగా 29.2 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

weather report on wednesday in telangana
తేమగాలుల వల్ల రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
author img

By

Published : Jan 9, 2020, 5:51 AM IST

Updated : Jan 9, 2020, 6:12 AM IST

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా రామగుండంలో బుధవారం తెల్లవారుజామున సాధారణంకన్నా 7 డిగ్రీల మేరకు పెరిగి 22 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్​లో 5.6 డిగ్రీలు పెరిగి 20.9 డిగ్రీలకు చేరింది. నిజామాబాద్​లో 5.4 డిగ్రీలు పెరిగి 19.9 డిరగ్రీలుగా నమోదైంది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం ఈ నెలలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమగాలులు కొనసాగుతున్నాయని వీటి కారణంగా ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. బుధవారం పగలు హైదరాబాద్​లో 29.9, రామగుండంలో 29.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా రామగుండంలో బుధవారం తెల్లవారుజామున సాధారణంకన్నా 7 డిగ్రీల మేరకు పెరిగి 22 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్​లో 5.6 డిగ్రీలు పెరిగి 20.9 డిగ్రీలకు చేరింది. నిజామాబాద్​లో 5.4 డిగ్రీలు పెరిగి 19.9 డిరగ్రీలుగా నమోదైంది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం ఈ నెలలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమగాలులు కొనసాగుతున్నాయని వీటి కారణంగా ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. బుధవారం పగలు హైదరాబాద్​లో 29.9, రామగుండంలో 29.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు

File : TG_Hyd_02_09_Krishna_Board_Meeting_Dry_3053262 From : Raghu Vardhan ( ) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. నిన్న జరగాల్సిన భేటీ చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఇవాళ హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు సమావేశం కానుంది. బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగే సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పాల్గొంటారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు, కృష్ణా బోర్డు నిర్వహణా నియమావళి, బడ్జెట్, బోర్డు విజయవాడకు తరలింపు తదితర అంశాలపై చర్చిస్తారు. దీంతో పాటు మరో రెండు అంశాలపై అదనంగా చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. గృహ వినియోగం కోసం తీసుకున్న నీటిని 20 శాతం మాత్రమే పరిగణించాలన్న ట్రైబ్యునల్ తీర్పును పాటించడం లేదని తెలంగాణ పేర్కొంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీరు తరలిస్తున్నందున ఆమేరకు తెలంగాణకు 45 టీఎంసీల నీరు అదనంగా ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా బోర్డు సమావేశంలో చర్చించాలని ప్రతిపాదించింది. సాగర్ ఎడమ కాల్వ ద్వారా కింది పొలాలకు నీరు రావడం లేదని... సంబంధించిన అంశాలపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అటు ఈ నెల 21వ తేదీన కేంద్రజలవనరుల శాఖ నిర్వహించనున్న సమావేశం విషయమై కూడా బోర్డు భేటీలో చర్చ జరగనుంది. ఈ నెల 21న దిల్లీలో జరగనున్న సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల సంబంధిత అంశాలపై కేంద్ర జలవనరుల శాఖ చర్చించనుంది.
Last Updated : Jan 9, 2020, 6:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.