ETV Bharat / city

TRS Campaign in UP: యూపీ ఎన్నికలపై తెరాస ఫోకస్​.. ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధం..!

author img

By

Published : Jan 15, 2022, 8:12 PM IST

TRS Campaign in UP: జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న గులాబీ పార్టీ... ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారించింది. సమాజ్​వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారానికి సిద్ధమవుతోంది. భాజపా వ్యతిరేక పార్టీలతో కలిసి... ప్రతక్షంగా రంగంలోకి దిగాలని భావిస్తోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ నేతృత్వంలో తెరాస బృందం వెళ్లేందుకు వ్యూహరచన జరుగుతోంది. ఇటీవల సీపీఐ, సీపీఎం, డీఎంకే, జేడీఎస్ నేతలతో భేటీ అయిన కేసీఆర్.. త్వరలో అఖిలేష్ యాదవ్ సహా వివిధ రాష్ట్రాలతో నేతలతో చర్చించనున్నారు. భేటీల వెనక ఓ రాజకీయ వ్యూహకర్త కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లేదా ఉత్తరప్రదేశ్​లో భాజపాయేతర భావస్వారూప్య శక్తుల సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

TRS ready to Campaign in UP elections to support samajvadhi party
TRS ready to Campaign in UP elections to support samajvadhi party

TRS Campaign in UP: జాతీయ స్థాయి రాజకీయ కూటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని భావిస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా... సమాజ్​వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని యోచిస్తోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ నేతలతో కూడిన బృందం యూపీ వెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా ఒక సభలో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అఖిలేష్​ యాదవ్​తో చర్చించి..

ప్రచారాస్త్రాల కోసం భాజపా వ్యతిరేక అంశాలపై అధ్యయనం చేస్తోంది. సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్​తో చర్చించి.. త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. యూపీలో సమాజ్​వాదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. అక్కడి నేతలతో సంప్రదింపుల అనంతరం ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ఇటీవలే ట్విట్టర్​లో కూడా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రచారంలో గతంలోనూ తెరాస పాల్గొంది. ఝార్ఖండ్​లో 2009 ఎన్నికల్లో శిబుసోరెన్​కు మద్దతుగా తెరాస బృందం ప్రచారం నిర్వహించింది. కర్ణాటకలో 2018లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లాలని భావించినప్పటికీ.. వీలు కాకపోవడంతో తెలుగు ప్రజలంతా జేడీఎస్​కు ఓటేయాలని పిలుపునిచ్చారు.

భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు..

భాజపా వ్యతిరేక పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రక్రియలో తెరాస అధినేత కేసీఆర్ తలమునకలయ్యారు. గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​తో చర్చలు జరిపారు. ఇటీవల ప్రగతిభవన్​లో సీపీఐ నేతలు డి.రాజా, కేరళ మంత్రి రాజన్.. సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, త్రిపూర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్​తో ప్రగతిభవన్​లో కేసీఆర్ భేటీ అయ్యారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్​తో ఫోన్లో మాట్లాడారు. కూటమి ఏర్పాటులో తెరాసకు తోడుగా ఓ రాజకీయ వ్యూహకర్త కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనే కూటమికి ప్రయత్నాలు మొదలు పెట్టిన కేసీఆర్... అప్పడు కర్ణాటక జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామి, తమిళనాడులో స్టాలిన్, ఒడిశాలో బిజూ పట్నాయక్, ఝార్ఖండ్​లో శిబుసోరెన్, యూపీలో అఖిలేష్ యాదవ్, ఏపీలో వైకాపా అధినేత జగన్, బంగాల్​లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతోనూ చర్చించారు.

త్వరలోనే సమావేశం..

భాజపా ముక్త్ భారత్ నినాదంతో.. కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ప్రజాస్వామిక, లౌకిక కూటమి ఏర్పాటుకు కసరత్తు జరుపుతోంది. భాజపా వ్యతిరేక, భావసారూప్య పార్టీలన్నీ కలిసి.. త్వరలో హైదరాబాద్ లేదా ఉత్తరప్రదేశ్​లో సమావేశం కావాలని భావిస్తున్నాయి. మరోవైపు దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:

TRS Campaign in UP: జాతీయ స్థాయి రాజకీయ కూటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని భావిస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా... సమాజ్​వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని యోచిస్తోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ నేతలతో కూడిన బృందం యూపీ వెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా ఒక సభలో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అఖిలేష్​ యాదవ్​తో చర్చించి..

ప్రచారాస్త్రాల కోసం భాజపా వ్యతిరేక అంశాలపై అధ్యయనం చేస్తోంది. సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్​తో చర్చించి.. త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. యూపీలో సమాజ్​వాదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. అక్కడి నేతలతో సంప్రదింపుల అనంతరం ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ఇటీవలే ట్విట్టర్​లో కూడా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రచారంలో గతంలోనూ తెరాస పాల్గొంది. ఝార్ఖండ్​లో 2009 ఎన్నికల్లో శిబుసోరెన్​కు మద్దతుగా తెరాస బృందం ప్రచారం నిర్వహించింది. కర్ణాటకలో 2018లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లాలని భావించినప్పటికీ.. వీలు కాకపోవడంతో తెలుగు ప్రజలంతా జేడీఎస్​కు ఓటేయాలని పిలుపునిచ్చారు.

భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు..

భాజపా వ్యతిరేక పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రక్రియలో తెరాస అధినేత కేసీఆర్ తలమునకలయ్యారు. గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​తో చర్చలు జరిపారు. ఇటీవల ప్రగతిభవన్​లో సీపీఐ నేతలు డి.రాజా, కేరళ మంత్రి రాజన్.. సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, త్రిపూర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్​తో ప్రగతిభవన్​లో కేసీఆర్ భేటీ అయ్యారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్​తో ఫోన్లో మాట్లాడారు. కూటమి ఏర్పాటులో తెరాసకు తోడుగా ఓ రాజకీయ వ్యూహకర్త కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనే కూటమికి ప్రయత్నాలు మొదలు పెట్టిన కేసీఆర్... అప్పడు కర్ణాటక జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామి, తమిళనాడులో స్టాలిన్, ఒడిశాలో బిజూ పట్నాయక్, ఝార్ఖండ్​లో శిబుసోరెన్, యూపీలో అఖిలేష్ యాదవ్, ఏపీలో వైకాపా అధినేత జగన్, బంగాల్​లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతోనూ చర్చించారు.

త్వరలోనే సమావేశం..

భాజపా ముక్త్ భారత్ నినాదంతో.. కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ప్రజాస్వామిక, లౌకిక కూటమి ఏర్పాటుకు కసరత్తు జరుపుతోంది. భాజపా వ్యతిరేక, భావసారూప్య పార్టీలన్నీ కలిసి.. త్వరలో హైదరాబాద్ లేదా ఉత్తరప్రదేశ్​లో సమావేశం కావాలని భావిస్తున్నాయి. మరోవైపు దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.