ETV Bharat / city

White challenge telangana: 'వార్తల్లో నిలిచేందుకే రేవంత్​ నిరాధార ఆరోపణలు'

author img

By

Published : Sep 21, 2021, 4:16 PM IST

వార్తల్లో నిలిచేందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి నిరాధార ఆరోపణలు(white challenge telangana) చేస్తూ.. పబ్బం గడుపుతున్నారని తెరాస ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మండిపడ్డారు.

trs mlas fire on revanth reddy comments on ktr
trs mlas fire on revanth reddy comments on ktr

తెరాస ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ చీటర్స్‌ కమిటీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడంటూ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా(white challenge telangana).. కేటీఆర్‌పై చేసిన విమర్శలే పదేపదే చేస్తున్నాడని బాలరాజు మండిపడ్డారు. కేవలం ఉనికి కాపాడుకునేందుకే విమర్శలు చేస్తున్నారని బాలరాజు దుయ్యబట్టారు. వార్తల్లో నిలిచేందుకు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు రాహుల్‌ గాంధీ మెడకు చుట్టుకున్నాయన్నారు.

"దేశవ్యాప్తంగా దళితబంధు పథకానికి రీసౌండ్​ వస్తోంది. రైతుబంధుకు రీసౌండ్​ వచ్చింది. దేశంలో జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గింది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలేటువంటి లక్షణాలు, నిబద్ధత ఉన్న నాయకులు కేసీఆర్​, కేటీఆర్​. అటువంటి నాయకులపై విమర్శలు చేయటం వల్ల వార్తల్లో నిలుస్తామనే కుటిల ప్రయత్నం రేవంత్​రెడ్డి చేస్తున్నాడు. ఇప్పటికైన తీరు మార్చుకోకపోతే.. పరిణామాలు వేరే ఉంటాయి."- గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే

వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చడం వల్ల రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేటీఆర్​పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులకే డ్రగ్స్‌ పరీక్షలు చేయాలని కిషోర్‌ తెలిపారు. సమస్యలపై పోరాడాలి కానీ.. వ్యక్తులపై నిరాధార మాటల దాడితో ఒరిగేదేమి ఉండని తెలిపారు. ఆయన తీరుమారకుంటే రేపటి నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

"రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మాట్లాడాలి కానీ.. ఎంతసేపు కేసీఆర్​, కేటీఆర్​ను తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. దేశమంతా గ్రీన్​ఛాలెంజ్​ అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ వైట్​ ఛాలెంజ్​ ఏంది..? మరి కాంగ్రెస్​ పార్టీ వాళ్లందరు ఇవ్వండి.. తెరాస పార్టీ వాళ్లందరం ఇద్దాం. ఎవరెక్కువ మంది తేలుతారో చూద్దాం. పంజాబ్​ మొత్తం డ్రగ్స్​కు హబ్​ అని ఉడ్తా పంజాబ్​ సినిమానే తీశిండ్రు. కాంగ్రెస్​ పార్టీ ఎక్కడెక్కడ పాలించిందో.. అందరు నాయకులు డ్రగ్స్​ కేసుల్లో ఉన్నోళ్లే."

- గాదరి కిశోర్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే

గ్రీన్‌ ఛాలెంజ్‌కు.. రేవంత్ వైట్‌ ఛాలెంజ్‌(white challenge telangana)కు పోలికేంటని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్‌పై ఆధారాలుంటే నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ పరువు ప్రతిష్టలను, హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్న రేవంత్‌పై ప్రతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు రేవంత్ ఉద్యమ ద్రోహమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ సినీయర్లు వారి పార్టీని రక్షించుకోవాలని హితవు పలికారు.

'వార్తల్లో నిలిచేందుకే రేవంత్​ నిరాధార ఆరోపణలు'

ఇదీ చూడండి:

తెరాస ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ చీటర్స్‌ కమిటీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడంటూ ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా(white challenge telangana).. కేటీఆర్‌పై చేసిన విమర్శలే పదేపదే చేస్తున్నాడని బాలరాజు మండిపడ్డారు. కేవలం ఉనికి కాపాడుకునేందుకే విమర్శలు చేస్తున్నారని బాలరాజు దుయ్యబట్టారు. వార్తల్లో నిలిచేందుకు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు రాహుల్‌ గాంధీ మెడకు చుట్టుకున్నాయన్నారు.

"దేశవ్యాప్తంగా దళితబంధు పథకానికి రీసౌండ్​ వస్తోంది. రైతుబంధుకు రీసౌండ్​ వచ్చింది. దేశంలో జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గింది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలేటువంటి లక్షణాలు, నిబద్ధత ఉన్న నాయకులు కేసీఆర్​, కేటీఆర్​. అటువంటి నాయకులపై విమర్శలు చేయటం వల్ల వార్తల్లో నిలుస్తామనే కుటిల ప్రయత్నం రేవంత్​రెడ్డి చేస్తున్నాడు. ఇప్పటికైన తీరు మార్చుకోకపోతే.. పరిణామాలు వేరే ఉంటాయి."- గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే

వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చడం వల్ల రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేటీఆర్​పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులకే డ్రగ్స్‌ పరీక్షలు చేయాలని కిషోర్‌ తెలిపారు. సమస్యలపై పోరాడాలి కానీ.. వ్యక్తులపై నిరాధార మాటల దాడితో ఒరిగేదేమి ఉండని తెలిపారు. ఆయన తీరుమారకుంటే రేపటి నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

"రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మాట్లాడాలి కానీ.. ఎంతసేపు కేసీఆర్​, కేటీఆర్​ను తిట్టటమే పనిగా పెట్టుకున్నారు. దేశమంతా గ్రీన్​ఛాలెంజ్​ అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ వైట్​ ఛాలెంజ్​ ఏంది..? మరి కాంగ్రెస్​ పార్టీ వాళ్లందరు ఇవ్వండి.. తెరాస పార్టీ వాళ్లందరం ఇద్దాం. ఎవరెక్కువ మంది తేలుతారో చూద్దాం. పంజాబ్​ మొత్తం డ్రగ్స్​కు హబ్​ అని ఉడ్తా పంజాబ్​ సినిమానే తీశిండ్రు. కాంగ్రెస్​ పార్టీ ఎక్కడెక్కడ పాలించిందో.. అందరు నాయకులు డ్రగ్స్​ కేసుల్లో ఉన్నోళ్లే."

- గాదరి కిశోర్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే

గ్రీన్‌ ఛాలెంజ్‌కు.. రేవంత్ వైట్‌ ఛాలెంజ్‌(white challenge telangana)కు పోలికేంటని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్‌పై ఆధారాలుంటే నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ పరువు ప్రతిష్టలను, హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్న రేవంత్‌పై ప్రతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు రేవంత్ ఉద్యమ ద్రోహమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ సినీయర్లు వారి పార్టీని రక్షించుకోవాలని హితవు పలికారు.

'వార్తల్లో నిలిచేందుకే రేవంత్​ నిరాధార ఆరోపణలు'

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.