ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్ @7PM - టాప్​టెన్​ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @7PM
టాప్​టెన్​ న్యూస్ @7PM
author img

By

Published : Feb 1, 2021, 6:57 PM IST

1. ఏ రంగానికెంత..?

కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక రంగానికి చికిత్స చేసే లక్ష్యంతో ఈ ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మూల సూత్రంగా రూ.34.83 లక్షల కోట్లతో ఆర్థిక టీకా అందజేశారు. ఇందులో ఏ రంగానికి ఎంత మేర ఖర్చు చేయనున్నారో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కొత్తగా అగ్రిసెస్

కరోనా టీకా పంపిణీ సహా, మెరుగైన వైద్య సేవల కోసం ఆరోగ్య రంగ వ్యయాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు కొత్తగా అగ్రి సెస్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఎక్సైజ్, దిగుమతి సుంకాల్లో కోత విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రైల్వేకు భారీగా నిధులు

కరోనా మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్న వేళ... 2021-22 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రవాణా వ్యవస్థలో ప్రధానమైన రైల్వే రంగానికి ఈ బడ్జెట్​లో భారీ కేటాయింపులే దక్కాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్‌ జిల్లాలో 15 మంది రిమ్స్‌ వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో ఆహారం కలుషితమై అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైద్య విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కాలు కదిపిన తమిళి సై

పద్మశ్రీ పురస్కారం పొందిన కనకరాజును... రాజ్​భవన్​లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ ఘనంగా సన్మానించారు. అనంతరం తమిళి సై, మంత్రి సత్యవతి రాఠోడ్​... కనకరాజు బృందంతో కలిసి గుస్సాడీ నృత్యం చేసి అరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పరీక్షించొద్దు..

హన్మకొండలో నిర్వహించిన ప్రజా సంక్షేమ యాత్రలో ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్​భాస్కర్​ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే నివాసంపై భాజపా శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా​ ఖండించారు. దమ్ముంటే ప్రజలకు మధ్యకు వచ్చి చర్చ పెట్టాలి కానీ.. ఇలా దాడులు చేయడం సరికాదని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అరెస్టు.. విడుదల

వరంగల్​కు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. భూదాన్​పోచంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించిన అనంతరం విడుదల చేశారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు స్టేషన్​ వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. శానిటైజర్ వేశారు

పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో జరిగిన నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. పోలియో చుక్కలు అనుకొని.. చిన్నారులకు శానిటైజర్​ వేశారు సిబ్బంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరగ్గా.. తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్​ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆ రికార్డులపై కోహ్లీ గురి

ప్రతి సిరీస్​లో దాదాపు ఏదో ఒక రికార్డును అందుకునే టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్​తో జరుగబోయే సిరీస్​లో వాటిని అందుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. హ్యాపీ బర్త్​ డే బ్రహ్మీ

టాలీవుడ్​లో లెక్కలేనన్ని సినిమాల్లో హాస్యనటుడి పాత్రలు పోషించి ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు నటుడు బ్రహ్మానందం. అలా ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. ఏ రంగానికెంత..?

కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక రంగానికి చికిత్స చేసే లక్ష్యంతో ఈ ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మూల సూత్రంగా రూ.34.83 లక్షల కోట్లతో ఆర్థిక టీకా అందజేశారు. ఇందులో ఏ రంగానికి ఎంత మేర ఖర్చు చేయనున్నారో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కొత్తగా అగ్రిసెస్

కరోనా టీకా పంపిణీ సహా, మెరుగైన వైద్య సేవల కోసం ఆరోగ్య రంగ వ్యయాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు కొత్తగా అగ్రి సెస్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఎక్సైజ్, దిగుమతి సుంకాల్లో కోత విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రైల్వేకు భారీగా నిధులు

కరోనా మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్న వేళ... 2021-22 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రవాణా వ్యవస్థలో ప్రధానమైన రైల్వే రంగానికి ఈ బడ్జెట్​లో భారీ కేటాయింపులే దక్కాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్‌ జిల్లాలో 15 మంది రిమ్స్‌ వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో ఆహారం కలుషితమై అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైద్య విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కాలు కదిపిన తమిళి సై

పద్మశ్రీ పురస్కారం పొందిన కనకరాజును... రాజ్​భవన్​లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ ఘనంగా సన్మానించారు. అనంతరం తమిళి సై, మంత్రి సత్యవతి రాఠోడ్​... కనకరాజు బృందంతో కలిసి గుస్సాడీ నృత్యం చేసి అరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పరీక్షించొద్దు..

హన్మకొండలో నిర్వహించిన ప్రజా సంక్షేమ యాత్రలో ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్​భాస్కర్​ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే నివాసంపై భాజపా శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా​ ఖండించారు. దమ్ముంటే ప్రజలకు మధ్యకు వచ్చి చర్చ పెట్టాలి కానీ.. ఇలా దాడులు చేయడం సరికాదని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అరెస్టు.. విడుదల

వరంగల్​కు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. భూదాన్​పోచంపల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించిన అనంతరం విడుదల చేశారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు స్టేషన్​ వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. శానిటైజర్ వేశారు

పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో జరిగిన నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. పోలియో చుక్కలు అనుకొని.. చిన్నారులకు శానిటైజర్​ వేశారు సిబ్బంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరగ్గా.. తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్​ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆ రికార్డులపై కోహ్లీ గురి

ప్రతి సిరీస్​లో దాదాపు ఏదో ఒక రికార్డును అందుకునే టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్​తో జరుగబోయే సిరీస్​లో వాటిని అందుకునే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. హ్యాపీ బర్త్​ డే బ్రహ్మీ

టాలీవుడ్​లో లెక్కలేనన్ని సినిమాల్లో హాస్యనటుడి పాత్రలు పోషించి ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు నటుడు బ్రహ్మానందం. అలా ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.