1. రాజన్న రాజ్యం తెస్తా..
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఏపీ ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. హైదరాబాద్ లోటస్పాండ్లో అభిమానులు, వైకాపా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఫ్యాక్షన్కు తావులేదు
రాష్ట్రంలో షర్మిల పార్టీ ప్రయత్నాలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదన్న మంత్రి... తెలంగాణలో ఫ్యాక్షనిజం అంగీకరించబోమని ఎద్దేవా చేశారు. మరోవైపు బీసీ కోసం భాజపా చేస్తున్న పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. జల ప్రళయంలో 31 మంది మృతి
ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు గల్లంతైనవారి కోసం గాలిస్తున్నాయి. తపోవన్ విద్యుత్ కేంద్రం వద్ద ఉన్న రెండో సొరంగంలో వంద మీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు 31 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆపరేషన్ ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుతం వరద ముప్పు తొలిగిపోయిందని తెలిపారు. ఐటీబీపీ, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గర్విస్తున్నా..
పాకిస్థాన్ పరిస్థితుల గురించి చదివినప్పుడు తాను భారత ముస్లింగా గర్వపడతానని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. తన రాజకీయ జీవితంలో ఎంతో నేర్చుకున్నట్లు రాజ్యసభలో పదవీ విరమణకు ముందు చేసిన ప్రసంగంలో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ట్విట్టర్ చర్చలు
1,178 ట్విట్టర్ ఖాతాలపై వేటు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై కేంద్ర ఐటీ మంత్రితో అధికారిక చర్చలు జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. రైతు నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఈ ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. నవ్వితే నొప్పి ఉండదు
కరోనా టీకాను నవ్వుతూ తీసుకోవాలని సూచిస్తున్నారు కాలిఫోర్నియా పరిశోధకులు. మనసారా నవ్వితే సూది నొప్పి 40 శాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. వారసులొస్తున్నారు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ వారసుడు అర్జున్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేయనున్నాడు. గత కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్ జట్టు నెట్ బౌలర్గా పనిచేసిన అతడు.. ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ఆడిన ఐదుగురు స్టార్ క్రికెటర్ల వారసుల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఇంగ్లాండ్ విజయం
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. టీమ్ఇండియాను రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌట్ చేసి 227 పరగుల తేడాతో గెలుపొందింది. జాక్ లీచ్, అండర్సన్లు తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రాజీవ్ కపూర్ కన్నుమూత
రిషి కపూర్ సోదరుడు, బాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కపూర్ (58) కన్నుమూశారు. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.