ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 7PM

author img

By

Published : May 25, 2021, 7:00 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@ 7PM
టాప్‌టెన్ న్యూస్ @ 7PM
  • 28 నుంచి సూపర్ స్ప్రెడర్లకు టీకాలు

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్​ను ప్రభుత్వం వేగవంతం చేసింది. సూపర్ స్ప్రెడర్లను గుర్తించడం కోసం విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో... మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పని ప్రదేశాల్లో టీకా...

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడటంతో పట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సూపర్‌ పోలీస్‌...

ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన మెరైన్​ పోలీసు అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు. వరద నీరు చుట్టుముట్టిన ప్రాంతంలో నడవలేని దుస్థితిలో ఉన్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలిని పోలీసు అధికారి శ్రీకాంత్ బారిక్​ తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్...

తెల్లవారితే పెళ్లి అనగా తన ప్రియురాలితో పరారయ్యాడు ఓ కొత్త పెళ్లి కొడుకు. అదీ కూడా కాబోయే అత్తింటివారు పెట్టిన బైకు, నగదుతో. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికా సాయం.. కానీ...

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్​లో పర్యటించారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. గాజా పునర్నిర్మాణానికి సాయం అందిస్తామని, అందులో హమాస్​ ఉండబోదని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 30 రోజుల్లో 30 నగరాలకు...

దేశవ్యాప్తంగా గడిచిన 30 రోజుల్లో 30 నగరాలకు కొవాగ్జిన్ టీకాలు సరఫరా చేసినట్లు భారత్​ బయోటెక్ మంగళవారం ప్రకటించింది. కరోనా వల్ల తమ సిబ్బందిలో కొంత మంది క్వారంటైన్​, సెలవుల్లో ఉన్నప్పటికీ దీనిని సాధించగలిగినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్​!...

వాయిదా పడిన ఐపీఎల్​ 14వ సీజన్​ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్​ 18 లేదా 19న లీగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అపద్బాంధవుడు సోనూసూద్​...

సహాయం కోసం తన నివాసం వద్దకు వచ్చిన పలువురి శరణార్థులను నటుడు సోనూసూద్​ కలిశారు. సాయం కోసం వచ్చిన వారి బాధలను విన్న సోనూ.. త్వరలోనే వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆనందయ్య మందుపై జగపతిబాబు...

కృష్ణపట్నం ఆనందయ్య కనుగొన్న మందుకు త్వరలోనే అనుమతి రావాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ నటుడు జగపతిబాబు తెలిపారు. ఆ మందుతో కరోనా వైరస్​ నుంచి మనల్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 28 నుంచి సూపర్ స్ప్రెడర్లకు టీకాలు

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్​ను ప్రభుత్వం వేగవంతం చేసింది. సూపర్ స్ప్రెడర్లను గుర్తించడం కోసం విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో... మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పని ప్రదేశాల్లో టీకా...

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి టీకాలు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడటంతో పట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సూపర్‌ పోలీస్‌...

ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన మెరైన్​ పోలీసు అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు. వరద నీరు చుట్టుముట్టిన ప్రాంతంలో నడవలేని దుస్థితిలో ఉన్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలిని పోలీసు అధికారి శ్రీకాంత్ బారిక్​ తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్...

తెల్లవారితే పెళ్లి అనగా తన ప్రియురాలితో పరారయ్యాడు ఓ కొత్త పెళ్లి కొడుకు. అదీ కూడా కాబోయే అత్తింటివారు పెట్టిన బైకు, నగదుతో. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికా సాయం.. కానీ...

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్​లో పర్యటించారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. గాజా పునర్నిర్మాణానికి సాయం అందిస్తామని, అందులో హమాస్​ ఉండబోదని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 30 రోజుల్లో 30 నగరాలకు...

దేశవ్యాప్తంగా గడిచిన 30 రోజుల్లో 30 నగరాలకు కొవాగ్జిన్ టీకాలు సరఫరా చేసినట్లు భారత్​ బయోటెక్ మంగళవారం ప్రకటించింది. కరోనా వల్ల తమ సిబ్బందిలో కొంత మంది క్వారంటైన్​, సెలవుల్లో ఉన్నప్పటికీ దీనిని సాధించగలిగినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్​!...

వాయిదా పడిన ఐపీఎల్​ 14వ సీజన్​ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్​ 18 లేదా 19న లీగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అపద్బాంధవుడు సోనూసూద్​...

సహాయం కోసం తన నివాసం వద్దకు వచ్చిన పలువురి శరణార్థులను నటుడు సోనూసూద్​ కలిశారు. సాయం కోసం వచ్చిన వారి బాధలను విన్న సోనూ.. త్వరలోనే వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆనందయ్య మందుపై జగపతిబాబు...

కృష్ణపట్నం ఆనందయ్య కనుగొన్న మందుకు త్వరలోనే అనుమతి రావాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ నటుడు జగపతిబాబు తెలిపారు. ఆ మందుతో కరోనా వైరస్​ నుంచి మనల్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.