ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM

author img

By

Published : May 24, 2021, 2:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM
  • హైవే కిల్లర్‌ కేసులో 12 మందికి ఉరిశిక్ష..

హైవే కిల్లర్‌ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు..

భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో జవహర్‌నగర్ పీఎస్‌లో సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పకడ్బందీగా లాక్‌డౌన్‌..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పదమూడో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అందరూ తెరాస వైపే..

హుజురాబాద్‌ నేతలందరూ తెరాస వైపే ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలను బెదిరిస్తున్నారన్న మాజీమంత్రి ఈటల రాజేందర్​ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రఘురామ విడుదల వాయిదా..

ఆంధ్రప్రదేశ్​ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విడుద‌ల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ర‌ఘురామ ఆరోగ్య ప‌రిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యూపీ​లో తొలి ఎల్లో ఫంగస్ కేసు..

దేశంలో తొలిసారిగా ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఎల్లో ఫంగస్​ కేసు నమోదైంది. సంజయ్​ నగర్​కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఎల్లో ఫంగస్​ను గుర్తించినట్లు హర్ష ఈఎన్​టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్​. బీపీ త్యాగి తెలిపారు. ఈ వ్యాధి బ్లాక్​, వైట్ ఫంగస్​ల కన్నా ప్రమాదకరమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కూతురి పెళ్లికి తండ్రే పురోహితుడు..

సాధారణంగా పురోహితుల సొంతింట్లో వివాహాది శభకార్యాలంటే ఇతర బ్రాహ్మణులు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన పెళ్లికి మాత్రం వధువు తండ్రే పురోహితుడిగా మారారు. అన్నీ తానై కూతురు, బంధువుల కుమార్తె పెళ్లిళ్లు జరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుక్కల నుంచి మనుషులకు కరోనా.. నిజమేనా?

మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? వాటితో ఆడుకోవడం ఇష్టమా? కరోనా సమయంలోనూ వాటితో సరదాగా గడుపుతున్నారా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే! వాటి నుంచి మీకు కరోనా వస్తుందా? లేదా తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసీస్​ ప్లేయర్స్​ దూరం!

ఇంగ్లాండ్ బోర్డు నిర్వహించాలనుకున్న 100 బంతుల క్రికెట్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమయ్యే అవకాశముంది. కరోనా ప్రయాణ ఆంక్షలు సహా అదే సమయంలో వెస్టిండీస్​తో సిరీస్​ ఉండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వకీల్​సాబ్' రీక్రియేట్..

పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ హీరోగా నటించిన 'వకీల్​సాబ్' ఏప్రిల్​లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అభిమానుల చేత ఈలలు కొట్టించింది. ఈ బ్యాక్​డ్రౌండ్ స్కోర్​, సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీక్రియేట్ చేశారు నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైవే కిల్లర్‌ కేసులో 12 మందికి ఉరిశిక్ష..

హైవే కిల్లర్‌ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు..

భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో జవహర్‌నగర్ పీఎస్‌లో సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పకడ్బందీగా లాక్‌డౌన్‌..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పదమూడో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అందరూ తెరాస వైపే..

హుజురాబాద్‌ నేతలందరూ తెరాస వైపే ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలను బెదిరిస్తున్నారన్న మాజీమంత్రి ఈటల రాజేందర్​ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రఘురామ విడుదల వాయిదా..

ఆంధ్రప్రదేశ్​ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విడుద‌ల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న ర‌ఘురామ ఆరోగ్య ప‌రిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యూపీ​లో తొలి ఎల్లో ఫంగస్ కేసు..

దేశంలో తొలిసారిగా ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో ఎల్లో ఫంగస్​ కేసు నమోదైంది. సంజయ్​ నగర్​కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఎల్లో ఫంగస్​ను గుర్తించినట్లు హర్ష ఈఎన్​టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్​. బీపీ త్యాగి తెలిపారు. ఈ వ్యాధి బ్లాక్​, వైట్ ఫంగస్​ల కన్నా ప్రమాదకరమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కూతురి పెళ్లికి తండ్రే పురోహితుడు..

సాధారణంగా పురోహితుల సొంతింట్లో వివాహాది శభకార్యాలంటే ఇతర బ్రాహ్మణులు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన పెళ్లికి మాత్రం వధువు తండ్రే పురోహితుడిగా మారారు. అన్నీ తానై కూతురు, బంధువుల కుమార్తె పెళ్లిళ్లు జరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుక్కల నుంచి మనుషులకు కరోనా.. నిజమేనా?

మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? వాటితో ఆడుకోవడం ఇష్టమా? కరోనా సమయంలోనూ వాటితో సరదాగా గడుపుతున్నారా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే! వాటి నుంచి మీకు కరోనా వస్తుందా? లేదా తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసీస్​ ప్లేయర్స్​ దూరం!

ఇంగ్లాండ్ బోర్డు నిర్వహించాలనుకున్న 100 బంతుల క్రికెట్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమయ్యే అవకాశముంది. కరోనా ప్రయాణ ఆంక్షలు సహా అదే సమయంలో వెస్టిండీస్​తో సిరీస్​ ఉండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'వకీల్​సాబ్' రీక్రియేట్..

పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ హీరోగా నటించిన 'వకీల్​సాబ్' ఏప్రిల్​లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అభిమానుల చేత ఈలలు కొట్టించింది. ఈ బ్యాక్​డ్రౌండ్ స్కోర్​, సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీక్రియేట్ చేశారు నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.