- " class="align-text-top noRightClick twitterSection" data="">
- చిన్నారికి పునర్జన్మ...
కేటీఆర్(KTR) సార్.. నా కుమార్తెకు గొంతు చుట్టూ కణితి ఏర్పడి బాధపడుతోంది.. ఆపరేషన్ చేయించే ఆర్థిక పరిస్థితి లేదు.. ఆర్థిక సాయం చేయండి ప్లీజ్’’అని చిన్నారి తండ్రి ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ను కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించి.. వారికి సాయం చేస్తానని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- యథేచ్ఛగా నకిలీ విత్తన దందా...
నాసిరకం విత్తనాల దందా రాష్ట్రం నలుమూలలా మాఫియా తరహాలో అల్లుకుపోయిందని రెండు నెలలుగా టాస్క్ఫోర్స్ బృందాలు జరుపుతున్న తనిఖీల్లో స్పష్టమవుతోంది. కొందరు వ్యాపారులు, చిన్న విత్తన కంపెనీల యజమానులే కాకుండా..పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కేటాయించిన నీటినే వాడుకుంటాం...
సాగు నీటిపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు... సరికాదని మంత్రులు పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకోనున్నాం అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- 50వేలకు దిగువకు...
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పోల్చితే తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 48,698 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 64,818 మంది కోలుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- దిల్లీలో హై అలర్ట్!...
జూన్ 26న దిల్లీలో రైతులు చేపట్టనున్న ఆందోళనల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- పట్టాలు తప్పిన రాజధాని..
రాజధాని ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలోని సొరంగంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!...
టీకాలు అందుబాటులోకి వచ్చినా.. ప్రపంచ దేశాలు కరోనా భయం గుప్పెట్లో బతుకుతున్నాయి. కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్తో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచంలోనే గొప్ప హోటల్!...
తాజ్ హోటల్స్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోని 50 గొప్ప హోటళ్లలో తాజ్ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 2016లో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో తొలిసారి టాప్ 50లోకి అడుగుపెట్టిన తాజ్ బ్రాండ్కు ఆ ఏడాది 38వ స్థానం దక్కింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- యూఏఈలో టీ20 ప్రపంచకప్...
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను యూఏఈలో జరిపేందుకు సిద్ధమైందట బీసీసీఐ. భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- నవ్విస్తున్న SVSC స్ఫూప్...
ఈటీవీలో ప్రతివారం ప్రసారమయ్యే 'జబర్దస్త్' లేటేస్ట్ ప్రోమో తెగ నవ్విస్తోంది. ఆది-రాంప్రసాద్ పంచులు, చంటి చేసిన SVSC సినిమా స్ఫూప్ కితకితలు పెడుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.