ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 1 PM

author img

By

Published : Jul 3, 2021, 12:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​
టాప్​ టెన్​ న్యూస్​
  • వివాహ బంధానికి ఆమిర్ ఖాన్ దంపతుల గుడ్​బై

బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్ ఖాన్​ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకోనున్నారు. 15 ఏళ్ల దాంపత్యానికి గుడ్​బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ దీనిపై అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం'

తమ ప్రభుత్వం వ్యాపారస్థుల సాధికారతకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకుగానూ రిటైల్​, హోల్​సేల్​ వ్యాపారస్థులను చిన్న, మధ్యతరగతి పరిశ్రమల కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం రాక కోసం సిరిసిల్ల ముస్తాబు..

ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు,ఫ్లెక్సీలతో నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో రూ. 70 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు రూ. 27 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జిల్లాకో సీటీస్కాన్ పరికరం ఏర్పాటు..

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సీటీస్కాన్ (CT Scan)​ పరికరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండగా.. మరో 16 నెలకొల్పాలనే యోచనలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్త సీఎం ఎంపికకు కసరత్తు!

ఉత్తరాఖండ్​ భాజపా శాసనసభాపక్ష భేటీ జరగనున్న నేపథ్యంలో కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ దెహ్రాదూన్​ చేరుకున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుందని తోమర్​ తెలిపారు. దాని కంటే ముందుగా పార్టీలోని అందరూ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముక్కు కారుతోందా... అయితే 'డెల్టా' కావచ్చు!

ఓవైపు కరోనా రూపాంతరం చెందుతుంటే దాని లక్షణాల్లోనూ మార్పులు జరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాప్తి తొలినాళ్లలో కనిపిస్తున్న లక్షణాలకు.. ప్రస్తుతం ఉన్న డెల్టా వేరియంట్​ లక్షణాలకు వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. మరి ఇప్పుడు కొత్తగా కనిపించే లక్షణాలేంటి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్షణికావేశంలో అయినవాళ్లపైనే దాడులు..

కుటుంబ తగాదాలు ఎంతో మంది ఉసురు(MURDER ATTEMPT) తీస్తున్నాయి. కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బిడ్డలు.. అనే తేడా లేకుండా విచక్షణారహితంగా తనవాళ్లపైనే దాడి(MURDER ATTEMPT) చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. క్షణికావేశంలో.. తన వాళ్ల ప్రాణాలు తీసి.. మరుక్షణమే ఎంతో మంది.. పశ్చాత్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ కంటెంట్లపై ఫేస్​బుక్​ చర్యలు..

3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై 20లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒకేసారి 88 ఉపగ్రహాలను నింగిలోకి..

స్పేస్​ ఎక్స్ అంతరిక్ష ప్రయోగ సంస్థ మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఒకేసారి 88 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ ఏడాది మొత్తంగా 900 ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ధోనీ కోసం చావడానికైనా సిద్ధం'

ఝార్ఖండ్ డైనమైట్​ మహేంద్ర సింగ్ ధోనీ (MS DHONI)పై ప్రశంసల జల్లు కురిపించాడు ఓపెనర్ కేఎల్ రాహుల్(KL RAHUL). అతడి కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్లమన్నా.. అందుకు జట్టు సభ్యులంతా మరో ఆలోచన లేకుండా వెళ్తామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వివాహ బంధానికి ఆమిర్ ఖాన్ దంపతుల గుడ్​బై

బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్ ఖాన్​ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకోనున్నారు. 15 ఏళ్ల దాంపత్యానికి గుడ్​బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ దీనిపై అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం'

తమ ప్రభుత్వం వ్యాపారస్థుల సాధికారతకు కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకుగానూ రిటైల్​, హోల్​సేల్​ వ్యాపారస్థులను చిన్న, మధ్యతరగతి పరిశ్రమల కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం రాక కోసం సిరిసిల్ల ముస్తాబు..

ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు,ఫ్లెక్సీలతో నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో రూ. 70 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు రూ. 27 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జిల్లాకో సీటీస్కాన్ పరికరం ఏర్పాటు..

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సీటీస్కాన్ (CT Scan)​ పరికరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండగా.. మరో 16 నెలకొల్పాలనే యోచనలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్త సీఎం ఎంపికకు కసరత్తు!

ఉత్తరాఖండ్​ భాజపా శాసనసభాపక్ష భేటీ జరగనున్న నేపథ్యంలో కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ దెహ్రాదూన్​ చేరుకున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుందని తోమర్​ తెలిపారు. దాని కంటే ముందుగా పార్టీలోని అందరూ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముక్కు కారుతోందా... అయితే 'డెల్టా' కావచ్చు!

ఓవైపు కరోనా రూపాంతరం చెందుతుంటే దాని లక్షణాల్లోనూ మార్పులు జరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాప్తి తొలినాళ్లలో కనిపిస్తున్న లక్షణాలకు.. ప్రస్తుతం ఉన్న డెల్టా వేరియంట్​ లక్షణాలకు వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. మరి ఇప్పుడు కొత్తగా కనిపించే లక్షణాలేంటి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్షణికావేశంలో అయినవాళ్లపైనే దాడులు..

కుటుంబ తగాదాలు ఎంతో మంది ఉసురు(MURDER ATTEMPT) తీస్తున్నాయి. కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బిడ్డలు.. అనే తేడా లేకుండా విచక్షణారహితంగా తనవాళ్లపైనే దాడి(MURDER ATTEMPT) చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. క్షణికావేశంలో.. తన వాళ్ల ప్రాణాలు తీసి.. మరుక్షణమే ఎంతో మంది.. పశ్చాత్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ కంటెంట్లపై ఫేస్​బుక్​ చర్యలు..

3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికపై 20లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒకేసారి 88 ఉపగ్రహాలను నింగిలోకి..

స్పేస్​ ఎక్స్ అంతరిక్ష ప్రయోగ సంస్థ మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. ఒకేసారి 88 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు పేర్కొంది. ఈ ఏడాది మొత్తంగా 900 ఉపగ్రహాలను నింగిలోకి పంపినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ధోనీ కోసం చావడానికైనా సిద్ధం'

ఝార్ఖండ్ డైనమైట్​ మహేంద్ర సింగ్ ధోనీ (MS DHONI)పై ప్రశంసల జల్లు కురిపించాడు ఓపెనర్ కేఎల్ రాహుల్(KL RAHUL). అతడి కోసం తుపాకీ గుండుకు ఎదురెళ్లమన్నా.. అందుకు జట్టు సభ్యులంతా మరో ఆలోచన లేకుండా వెళ్తామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.