ETV Bharat / city

Sekhar Kammula: 'హరీశ్​రావు ప్రజల మనిషని మరోసారి రుజువైంది'

author img

By

Published : Dec 30, 2021, 9:56 AM IST

Updated : Dec 30, 2021, 11:58 AM IST

Sekhar Kammula : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావుకు ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించినందుకు ధన్యవాదాలు చెప్పారు. హరీశ్ రావుని ప్రజల మంత్రి అని ఎందుకు పిలుస్తారో తెలపడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.

Sekhar Kammula
Sekhar Kammula

Sekhar Kammula : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువకుడు హర్షవర్ధన్​కు అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర వైద్య చికిత్స కేసులు వస్తున్నాయి.

హరీశ్​రావుని సాయం కోరిన శేఖర్ కమ్ముల..

Sekhar Kammula Thanked Harish Rao : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం క్రిస్టియన్‌ కాలనీకి చెందిన బాడ హర్షవర్ధన్‌ తీవ్రమైన ఐబీడీ సమస్యతో బాధ పడుతున్నారు. పేదరికంతో చికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఈ విషయం శేఖర్ కమ్ముల దృష్టికి వచ్చింది. శేఖర్ కమ్ముల వెంటనే ఈ యువకుడి పరిస్థితిని మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన హరీశ్ రావు నిమ్స్​లో హర్షవర్ధన్​కు చికిత్స అందించేలా ఆదేశాలు ఇచ్చారు.

హరీశ్ రావు ప్రజల మంత్రి..

Harish Rao Helped Young Man : అడిగిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీశ్​రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్​ రావును ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని ట్వీట్ చేశారు.

Sekhar Kammula : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువకుడు హర్షవర్ధన్​కు అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర వైద్య చికిత్స కేసులు వస్తున్నాయి.

హరీశ్​రావుని సాయం కోరిన శేఖర్ కమ్ముల..

Sekhar Kammula Thanked Harish Rao : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం క్రిస్టియన్‌ కాలనీకి చెందిన బాడ హర్షవర్ధన్‌ తీవ్రమైన ఐబీడీ సమస్యతో బాధ పడుతున్నారు. పేదరికంతో చికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఈ విషయం శేఖర్ కమ్ముల దృష్టికి వచ్చింది. శేఖర్ కమ్ముల వెంటనే ఈ యువకుడి పరిస్థితిని మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన హరీశ్ రావు నిమ్స్​లో హర్షవర్ధన్​కు చికిత్స అందించేలా ఆదేశాలు ఇచ్చారు.

హరీశ్ రావు ప్రజల మంత్రి..

Harish Rao Helped Young Man : అడిగిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీశ్​రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్​ రావును ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని ట్వీట్ చేశారు.

Last Updated : Dec 30, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.