ETV Bharat / city

జగన్నాటకం... అన్నం పెట్టిన సంస్థకే కన్నమేశాడు! - police

అన్నం పెట్టిన సంస్థకే కన్న వేశాడో ప్రబుద్ధుడు. మూడేళ్లు నమ్మకంగా పనిచేసి చివరికి సొత్తు ఖాజేశాడు. ఓ నాటకాన్ని రూపొందించి తప్పించుకోవాలని చూశాడు. తప్పు ఏ నాటికైనా బయట పడక మానదు కదా...

అన్నం పెట్టిన సంస్థకే కన్నం
author img

By

Published : Oct 2, 2019, 11:09 PM IST

అన్నం పెట్టిన సంస్థకే కన్నం

అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసేందుకు దోపిడీ నాటకం ఆడిన ఉద్యోగిని కూకట్‌పల్లి పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. పేరిశెట్టి దెన్దాదర్ కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని జై రాజేంద్ర జ్యువెల్ ప్యాలెస్ ప్రైవేటు లిమిటెడ్​లో సేల్స్​మెన్​గా గత మూడు ఏళ్లుగా పని చేస్తున్నాడు. గత నెల 30వ తేదీన మధ్యాహ్నం బంగారు దుకాణం మేనేజర్ ఆదేశం మేరకు పదకొండు లక్షల యాభై వేల రూపాయల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బయలుదేరాడు. దెన్దాదర్ దుకాణం సెల్లార్​లో అపస్మారక స్థితిలో కాళ్ళు చేతులు కట్టివేసి పడి ఉండటం గమనించిన సహోద్యోగులు మేనేజర్​కు సమాచారం అందించారు.

మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దెన్దాదర్​ను స్పృహలోకి తీసుకొచ్చారు. ఏం జరిగిందని వాకబు చేశారు. నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసి కాళ్ళు చేతులు కట్టివేసి తన వద్ద ఉన్న డబ్బులు దోచుకెళ్ళారని తెలిపాడు. పోలీసులకు అనుమానం కలిగింది. దెన్దాదర్ కట్టుకథలు చెప్తున్నాడన్న సందేహం వచ్చింది. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. తన స్నేహితుడు వినోద్ కుమార్​తో కలిసి దోపిడీ నాటకం ఆడి డబ్బులు అపహరించినట్లు అంగీకరించాడు. నిందితుల వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: అమ్మవారి కన్నులు దోచుకెళ్లిన దొంగలు

అన్నం పెట్టిన సంస్థకే కన్నం

అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసేందుకు దోపిడీ నాటకం ఆడిన ఉద్యోగిని కూకట్‌పల్లి పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. పేరిశెట్టి దెన్దాదర్ కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని జై రాజేంద్ర జ్యువెల్ ప్యాలెస్ ప్రైవేటు లిమిటెడ్​లో సేల్స్​మెన్​గా గత మూడు ఏళ్లుగా పని చేస్తున్నాడు. గత నెల 30వ తేదీన మధ్యాహ్నం బంగారు దుకాణం మేనేజర్ ఆదేశం మేరకు పదకొండు లక్షల యాభై వేల రూపాయల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బయలుదేరాడు. దెన్దాదర్ దుకాణం సెల్లార్​లో అపస్మారక స్థితిలో కాళ్ళు చేతులు కట్టివేసి పడి ఉండటం గమనించిన సహోద్యోగులు మేనేజర్​కు సమాచారం అందించారు.

మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దెన్దాదర్​ను స్పృహలోకి తీసుకొచ్చారు. ఏం జరిగిందని వాకబు చేశారు. నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసి కాళ్ళు చేతులు కట్టివేసి తన వద్ద ఉన్న డబ్బులు దోచుకెళ్ళారని తెలిపాడు. పోలీసులకు అనుమానం కలిగింది. దెన్దాదర్ కట్టుకథలు చెప్తున్నాడన్న సందేహం వచ్చింది. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. తన స్నేహితుడు వినోద్ కుమార్​తో కలిసి దోపిడీ నాటకం ఆడి డబ్బులు అపహరించినట్లు అంగీకరించాడు. నిందితుల వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి: అమ్మవారి కన్నులు దోచుకెళ్లిన దొంగలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.