ETV Bharat / city

కొవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరార్

author img

By

Published : Sep 2, 2020, 4:25 PM IST

కొవిడ్ కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

two-prisoners-escaped-from-the-covid-center
two-prisoners-escaped-from-the-covid-center


ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని డిట్కో హౌస్​ల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ నుంచి.. ఇద్దరు ఖైదీలు పరారైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో పట్టణంలోని సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నరసరావుపేటలోని పనసతోటకు చెందిన కొటారి సాయి కిరణ్, గుంటూరు పట్టాభిపురానికి చెందిన పులి రమేష్ అనే ఇద్దరు ఖైదీలు కొవిడ్​ బారిన పడ్డారు. వీరిద్దరూ గత కొన్ని రోజుల కిందట కరోనా సోకి ప్రభుత్వ కోవిడ్ సెంటర్​లో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సెక్యూరిటీ కళ్ళు గప్పి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసరావుపేట గ్రామీణ సీఐ వై. అచ్చయ్య తెలిపారు.


ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని డిట్కో హౌస్​ల వద్ద అధికారులు ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ నుంచి.. ఇద్దరు ఖైదీలు పరారైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో పట్టణంలోని సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నరసరావుపేటలోని పనసతోటకు చెందిన కొటారి సాయి కిరణ్, గుంటూరు పట్టాభిపురానికి చెందిన పులి రమేష్ అనే ఇద్దరు ఖైదీలు కొవిడ్​ బారిన పడ్డారు. వీరిద్దరూ గత కొన్ని రోజుల కిందట కరోనా సోకి ప్రభుత్వ కోవిడ్ సెంటర్​లో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సెక్యూరిటీ కళ్ళు గప్పి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నరసరావుపేట గ్రామీణ సీఐ వై. అచ్చయ్య తెలిపారు.

ఇదీ చదవండి: 'మహాప్రస్థానం లాంటి వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.