ETV Bharat / city

ఎడారి గులాబీలను ఎప్పుడైనా చూశారా...? - విజయవాడలో కనువిందు చేస్తున్న గులాబీలు

ప్రత్యేక వర్ణంలో కనిపిస్తున్న ఈ గులాబీలు మనసు దోచేస్తున్నాయి కదూ. అవి మామూలు గులాబీలు కాదు... ఎడారి గులాబీలు. ఎడినియం మెుక్కకు పూసిన పువ్వులు. వీటి అందాన్ని ఆస్వాదించాలంటే విజయవాడ వెళ్లాల్సిందే.

ఎడారి గులాబీలను ఎప్పుడైనా చూశారా...?
ఎడారి గులాబీలను ఎప్పుడైనా చూశారా...?
author img

By

Published : Mar 5, 2020, 10:51 AM IST


ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పటమట ఆర్టీసీ కాలనీలో ఉండే జయశ్రీరాణికి మెుక్కలు అంటే ఇష్టం. భర్త సహకారంతో ఇంటిని పచ్చదనంతో నింపేశారు. ఆ నందనవనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ ఎడారి గులాబీలు. 27 ఏళ్ల కిందట తన తండ్రికి చదువు చెప్పిన ప్రొఫెసర్ దత్తు... ఆమెకు ఎడినియం మొక్కను బహుమతిగా ఇచ్చారు. ఆ మొక్కకు పూసిన పూలు ఎంతో అందంగా ఉన్నాయి. మనసుకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండటం వల్ల మరిన్ని ఎడినియం మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఆ మొక్క పెరిగి పెద్దదై విత్తనాలు వచ్చాయి. కొన్ని మొక్కలను నర్సరీల నుంచి తీసుకొచ్చి, కంప్యూటర్​లో చూసి అంట్లు కట్టడం నేర్చుకున్నారు జయశ్రీ. తోటమాలి రాంబాబు సాయంతో మొక్కలకు అంట్లు కట్టి పెంచారు. ఆమె ఇంట్లో సుమారు 35 పైగా ఎడారి గులాబీ మొక్కలు ఉన్నాయి. పింక్, వైట్, పర్పుల్, మెరూన్... ఇలా విభిన్న వర్ణాల్లో గుబురుగా పూచిన పూలు కనువిందు చేస్తున్నాయి.

వీటికి ఎక్కువగా నీళ్లు అవసరం లేదు. నిర్వహణా సులువే. వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. నీళ్లు లేని చోట్లా ఇవి పెరుగుతాయి. డాబాపై కుండీల్లో వీటిని పెంచుతున్నారు. ఏడాది నుంచి పాతికేళ్ల వయసున్న మొక్కలు ఆమె వద్ద ఉన్నాయి. మొక్క వయసుని బట్టి వాటి ఖరీదు 2వేల రూపాయల నుంచి లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ పెరటితోట అవార్డునూ అందుకున్నారు జయశ్రీరాణి.

ఎడారి గులాబీలను ఎప్పుడైనా చూశారా...?

ఇదీ చూడండి:కృష్ణాజిల్లాలో జెల్లీఫిష్ సందడి..తరలివస్తున్న పర్యటకులు



ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పటమట ఆర్టీసీ కాలనీలో ఉండే జయశ్రీరాణికి మెుక్కలు అంటే ఇష్టం. భర్త సహకారంతో ఇంటిని పచ్చదనంతో నింపేశారు. ఆ నందనవనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ ఎడారి గులాబీలు. 27 ఏళ్ల కిందట తన తండ్రికి చదువు చెప్పిన ప్రొఫెసర్ దత్తు... ఆమెకు ఎడినియం మొక్కను బహుమతిగా ఇచ్చారు. ఆ మొక్కకు పూసిన పూలు ఎంతో అందంగా ఉన్నాయి. మనసుకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండటం వల్ల మరిన్ని ఎడినియం మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఆ మొక్క పెరిగి పెద్దదై విత్తనాలు వచ్చాయి. కొన్ని మొక్కలను నర్సరీల నుంచి తీసుకొచ్చి, కంప్యూటర్​లో చూసి అంట్లు కట్టడం నేర్చుకున్నారు జయశ్రీ. తోటమాలి రాంబాబు సాయంతో మొక్కలకు అంట్లు కట్టి పెంచారు. ఆమె ఇంట్లో సుమారు 35 పైగా ఎడారి గులాబీ మొక్కలు ఉన్నాయి. పింక్, వైట్, పర్పుల్, మెరూన్... ఇలా విభిన్న వర్ణాల్లో గుబురుగా పూచిన పూలు కనువిందు చేస్తున్నాయి.

వీటికి ఎక్కువగా నీళ్లు అవసరం లేదు. నిర్వహణా సులువే. వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. నీళ్లు లేని చోట్లా ఇవి పెరుగుతాయి. డాబాపై కుండీల్లో వీటిని పెంచుతున్నారు. ఏడాది నుంచి పాతికేళ్ల వయసున్న మొక్కలు ఆమె వద్ద ఉన్నాయి. మొక్క వయసుని బట్టి వాటి ఖరీదు 2వేల రూపాయల నుంచి లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ పెరటితోట అవార్డునూ అందుకున్నారు జయశ్రీరాణి.

ఎడారి గులాబీలను ఎప్పుడైనా చూశారా...?

ఇదీ చూడండి:కృష్ణాజిల్లాలో జెల్లీఫిష్ సందడి..తరలివస్తున్న పర్యటకులు


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.