ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పగిడిరాయికి చెందిన బాలిక అదృశ్యమైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. రాత్రి జొన్నగిరి పోలీస్ స్టేషన్కు బాలికను తీసుకువచ్చారు. బాలికను చూపించాలని పెద్దఎత్తున పోలీస్ స్టేషన్కు బంధువులు వెళ్లారు.
ఎస్సై సురేశ్ తమతో దురుసుగా ప్రవర్తించినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అనంతరం పగిడిరాయికి వెళ్లిన ఎస్సైపై మహిళలు కారంపొడి చల్లారు. ఈ ఘటనతో అర్ధరాత్రి గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు.
ఇదీ చదవండి: ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ