AICC review on membership: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఉదయం దిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్లతో ఏఐసీసీ అధికార ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అమలు తీరును కేసీ.. రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9 నాటికి 30వేల మంది సభ్యత్వ నమోదు సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలని వేణుగోపాల్ పీసీసీకి స్పష్టం చేశారు.
ఈ నెల 9 నుంచి జనవరి 26 లోపు... నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కేసీ ఆదేశించారు. సభ్యత్వ నమోదు విషయంలో అలసత్వం వద్దని.. గ్రామాల వారీగా దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదులో అన్ని స్థాయిల నాయకులను భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు.
సభ్యత్వం ఉంటే బీమా
digital membership registration: డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ద్వారా 30 లక్షల మందికి డిజిటల్ సభ్యత్వం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ గాంధీభవన్లో నవంబరు 1 న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రారంభించింది. ఓటర్ కార్డు ద్వారా తొలిసారి డిజిటల్ సభ్యత్వం ఇస్తున్నారు. డేటా అనటికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. రెండు లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: KK Latest Comments: కేంద్రం 'బాయిల్డ్ రైస్' అనే పదాన్ని తొలగించాలి: కేకే
CPI Chada on RTC bus charges: ఆర్టీసీ ఛార్జీల పెంపు సరికాదు.. నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి