రాష్ట్రంలో జూన్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారం తెలంగాణ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నాయని ఈ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. సోమవారం పొడి వాతావరణముంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2డిగ్రీలు ఎక్కువగా నమోదయింది. గాలిలో తేమ సాధారణంకన్నా తగ్గడంతో ఉక్కపోతలు పెరుగుతున్నాయి.
ఇదీ చూడండి: Police rides on Ganjai: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. పోలీసుల దాడులు ముమ్మరం