ETV Bharat / city

'కొత్త బ్లాకులకు అనుమతి అడిగితే.. ఉన్నవి ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర'

author img

By

Published : Jan 24, 2022, 6:56 PM IST

Koppula Eshwar on Singareni Blocks Privatization: లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో నడుస్తున్నట్లు చూపిస్తూ.. 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మరో 12 ఏళ్లలో ఇక్కడి బొగ్గు నిల్వలు పూర్తవుతాయని.. కొత్త బ్లాకులకు అవకాశం కల్పించాలని కోరితే.. ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోందని వాపోయారు.

Koppula Eshwar
Koppula Eshwar

Koppula Eshwar on Singareni Blocks Privatization: సింగరేణి సంస్థ హక్కులను హరించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 12 ఏళ్లలో పూర్తవుతాయని.. కొత్త బ్లాకులకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కొత్త బ్లాకులకు అనుమతి ఇవ్వకపోగా.. ఉన్నవి ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేందుకు కుట్ర పన్నుతోంది. దేశవ్యాప్తంగా 98 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసేందుకు చూస్తోంది. కొత్త చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా సంస్థలపై రుద్దుతోంది.

- కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

Koppula on Singareni Coal Blocks Privatization: కొత్త చట్టాలను తీసుకొచ్చి కేంద్ర సర్కార్.. సంస్థలపై బలవంతంగా రుద్దుతోందని మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లో నడుస్తున్నట్లు చూపుతున్నారని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికుల కుటుంబాలు నిరసన తెలిపాయని చెప్పారు. నిరసనలో భాగంగా 3 రోజులు సమ్మె చేశాయని గుర్తు చేశారు. వెంటనే కేంద్రం.. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : Singareni Coal Blocks Auction : సింగరేణి బొగ్గు గనులకు మరో ముప్పు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Koppula Eshwar on Singareni Blocks Privatization: సింగరేణి సంస్థ హక్కులను హరించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 12 ఏళ్లలో పూర్తవుతాయని.. కొత్త బ్లాకులకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కొత్త బ్లాకులకు అనుమతి ఇవ్వకపోగా.. ఉన్నవి ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేందుకు కుట్ర పన్నుతోంది. దేశవ్యాప్తంగా 98 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసేందుకు చూస్తోంది. కొత్త చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా సంస్థలపై రుద్దుతోంది.

- కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

Koppula on Singareni Coal Blocks Privatization: కొత్త చట్టాలను తీసుకొచ్చి కేంద్ర సర్కార్.. సంస్థలపై బలవంతంగా రుద్దుతోందని మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లో నడుస్తున్నట్లు చూపుతున్నారని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికుల కుటుంబాలు నిరసన తెలిపాయని చెప్పారు. నిరసనలో భాగంగా 3 రోజులు సమ్మె చేశాయని గుర్తు చేశారు. వెంటనే కేంద్రం.. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : Singareni Coal Blocks Auction : సింగరేణి బొగ్గు గనులకు మరో ముప్పు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.