ETV Bharat / city

కేంద్రం సాయం చేయాలి.. ప్రజలు సహకరించాలి: గుత్తా - ఈటీవీ భారత్​తో శాసనమండలి స్పీకర్​ ముఖాముఖి

లాక్​డౌన్​తో ఆదాయాలు పడిపోయిన వేళ రాష్ట్రాలకు ఆర్థికతోడ్పాటు అందించేలా కేంద్రంతో మాట్లాడాలని లోక్​సభ సభాపతి ఓం బిర్లాను దృశ్యమాధ్యమ సమీక్షలో కోరినట్టు మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను వివరించినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని కోరుతున్న గుత్తాతో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి...

telangana mandali speaker gutha sukhendar reddy interview with etv bharat
కేంద్రం సాయం చేయాలి.. ప్రజలు సహకరించాలి: గుత్తా
author img

By

Published : Apr 22, 2020, 6:01 AM IST

Updated : Apr 22, 2020, 6:45 AM IST

కేంద్రం సాయం చేయాలి.. ప్రజలు సహకరించాలి: గుత్తా

ప్ర: లోక్​సభ స్పీకర్​తో జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఏం చర్చించారు?

జ: కొవిడ్-19 నివారణకు ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల పాత్ర గురించి ముఖ్యంగా చర్చించాం. రాష్ట్రాలకు రావాల్సిన ఆర్థిక వనరులు కోతల్లేకుండా ఇవ్వాలని శాసనసభా స్పీకర్​తో కలిసి ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లాం.

ప్ర: మీరు లేవనెత్తిన అంశాలకు లోక్​సభ సభాపతి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

జ: స్పీకర్​కు ఉన్న పరిధి మేరకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.

ప్ర: కరోనా నివారణకు చట్టసభల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి పాత్ర పోషించాలని మీరంటారు?

జ: ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించాలి. వారి నియోజకవర్గాల్లో పేదలకు, వలస కార్మికులకు ప్రతి రోజూ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

ప్ర: ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు మీరిచ్చే సలహాలేంటి?

జ: ఇలాంటి పరిస్థితి మా జీవితకాలంలో చూడలేదు. ఉద్యమాలు వచ్చినప్పుడు ఒక రోజు, రెండు రోజులు కర్ఫ్యూలు చూసినం కానీ నెలల పాటు మాత్రం ఎప్పుడు లేదు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవడం, వసతులు కల్పిస్తున్నాయి. పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ సమష్ఠిగా కృషి చేస్తున్నారు. మన కోసం మన కుటుంబం కోసం స్వీయ నిర్బంధంలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'

కేంద్రం సాయం చేయాలి.. ప్రజలు సహకరించాలి: గుత్తా

ప్ర: లోక్​సభ స్పీకర్​తో జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఏం చర్చించారు?

జ: కొవిడ్-19 నివారణకు ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల పాత్ర గురించి ముఖ్యంగా చర్చించాం. రాష్ట్రాలకు రావాల్సిన ఆర్థిక వనరులు కోతల్లేకుండా ఇవ్వాలని శాసనసభా స్పీకర్​తో కలిసి ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లాం.

ప్ర: మీరు లేవనెత్తిన అంశాలకు లోక్​సభ సభాపతి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

జ: స్పీకర్​కు ఉన్న పరిధి మేరకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.

ప్ర: కరోనా నివారణకు చట్టసభల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి పాత్ర పోషించాలని మీరంటారు?

జ: ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించాలి. వారి నియోజకవర్గాల్లో పేదలకు, వలస కార్మికులకు ప్రతి రోజూ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

ప్ర: ఇటువంటి పరిస్థితిలో ప్రజలకు మీరిచ్చే సలహాలేంటి?

జ: ఇలాంటి పరిస్థితి మా జీవితకాలంలో చూడలేదు. ఉద్యమాలు వచ్చినప్పుడు ఒక రోజు, రెండు రోజులు కర్ఫ్యూలు చూసినం కానీ నెలల పాటు మాత్రం ఎప్పుడు లేదు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవడం, వసతులు కల్పిస్తున్నాయి. పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ సమష్ఠిగా కృషి చేస్తున్నారు. మన కోసం మన కుటుంబం కోసం స్వీయ నిర్బంధంలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'

Last Updated : Apr 22, 2020, 6:45 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.