ETV Bharat / city

అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం

author img

By

Published : Nov 10, 2019, 5:06 AM IST

Updated : Nov 10, 2019, 7:02 AM IST

పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు.. ఇలా కారణాలేవైనా... అన్నదాత బలవన్మరణాలు మాత్రం ఆగడం లేదు.

అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం

వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్​ నాలుగో స్థానంలో ఉంది. మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలిచింది.

2016లో ప్రమాద మరణాలు - ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ ( ఎన్​సీఆర్​బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

2016 గణాంకాల ప్రకారం

  1. దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు : 11,379
  2. తెలంగాణకు చెందిన వారు : 5.66 శాతం
  3. ఏపీకి చెందిన వారు : 7.06 శాతం

ఆంధ్రప్రదేశ్​తో పోలిస్తే తెలంగాణలో సొంత భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

  • తెలంగాణలో ఆత్మహత్యలు :

పురుషులు : 572

మహిళలు : 73 మంది

  • ఆంధ్రప్రదేశ్​లో ఆత్మహత్యలు

పురుషులు : 730

మహిళలు : 74

ఆత్మహత్యల్లోనూ ఆరో స్థానమే :

దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానం, ఆంధ్రప్రదేశ్​ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

2016లో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా... వారిలో 4.6 శాతం మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మృతుల్లో కూలీలు, గృహిణులే ఎక్కువ.

  • దేశవ్యాప్తంగా... 1,31,008

పురుషులు : 88,997 ; మహిళలు : 41,997 ; ట్రాన్స్​ జెండర్స్ : 14

  • తెలంగాణలో 9,019

పురుషులు : 6,316 ; మహిళలు : 2,701 ; ట్రాన్స్​ జెండర్స్ : 2

అత్యధికంగా ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాలలో మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర (17, 195), తమిళనాడు (15,182), పశ్చిమ్​ బంగా (13, 451) ఉన్నాయి.

  • వ్యవసాయంపై ఆధారపడి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాలు
మహారాష్ట్ర 3,661
కర్ణాటక 2,079
మధ్యప్రదేశ్ 1,321
ఆంధ్రప్రదేశ్ 804
ఛత్తీస్​గఢ్ 682
తెలంగాణ 645

వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్​ నాలుగో స్థానంలో ఉంది. మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలిచింది.

2016లో ప్రమాద మరణాలు - ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ ( ఎన్​సీఆర్​బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

2016 గణాంకాల ప్రకారం

  1. దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు : 11,379
  2. తెలంగాణకు చెందిన వారు : 5.66 శాతం
  3. ఏపీకి చెందిన వారు : 7.06 శాతం

ఆంధ్రప్రదేశ్​తో పోలిస్తే తెలంగాణలో సొంత భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

  • తెలంగాణలో ఆత్మహత్యలు :

పురుషులు : 572

మహిళలు : 73 మంది

  • ఆంధ్రప్రదేశ్​లో ఆత్మహత్యలు

పురుషులు : 730

మహిళలు : 74

ఆత్మహత్యల్లోనూ ఆరో స్థానమే :

దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానం, ఆంధ్రప్రదేశ్​ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

2016లో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా... వారిలో 4.6 శాతం మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మృతుల్లో కూలీలు, గృహిణులే ఎక్కువ.

  • దేశవ్యాప్తంగా... 1,31,008

పురుషులు : 88,997 ; మహిళలు : 41,997 ; ట్రాన్స్​ జెండర్స్ : 14

  • తెలంగాణలో 9,019

పురుషులు : 6,316 ; మహిళలు : 2,701 ; ట్రాన్స్​ జెండర్స్ : 2

అత్యధికంగా ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాలలో మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర (17, 195), తమిళనాడు (15,182), పశ్చిమ్​ బంగా (13, 451) ఉన్నాయి.

  • వ్యవసాయంపై ఆధారపడి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాలు
మహారాష్ట్ర 3,661
కర్ణాటక 2,079
మధ్యప్రదేశ్ 1,321
ఆంధ్రప్రదేశ్ 804
ఛత్తీస్​గఢ్ 682
తెలంగాణ 645
Intro:Body:Conclusion:
Last Updated : Nov 10, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.