ETV Bharat / city

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు అనుమతి

author img

By

Published : Nov 9, 2020, 3:14 PM IST

రాష్ట్ర హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

agrigold
అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు అనుమతి

అగ్రిగోల్డ్‌ కేసు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిచ్చింది. డబ్బులు చెల్లిచేందుకు వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని చెప్పింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్‌, సీఐడీ ఎస్పీ దరఖాస్తులను ధ్రువీకరిస్తారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.

మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం 2 వారాలు గడువు కోరగా... తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని బదులిచ్చింది. ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ తెలుపగా.. బ్యాంకుల పిటిషన్లపై గురువారం విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

అగ్రిగోల్డ్‌ కేసు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతిచ్చింది. డబ్బులు చెల్లిచేందుకు వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని చెప్పింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్‌, సీఐడీ ఎస్పీ దరఖాస్తులను ధ్రువీకరిస్తారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.

మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం 2 వారాలు గడువు కోరగా... తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. బదిలీ చేసే పాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని బదులిచ్చింది. ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ తెలుపగా.. బ్యాంకుల పిటిషన్లపై గురువారం విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

ఇదీ చదవండి:

మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం.. తేలనున్న భవితవ్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.