ETV Bharat / city

Vaccination: సూపర్‌ స్ప్రెడర్లకు టీకా.. కసరత్తు ప్రారంభించిన సర్కారు

author img

By

Published : May 27, 2021, 5:21 AM IST

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నిత్యం వందలమందిని కలిసే అవకాశం ఉన్న వారికి మొదటగా టీకా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 5 విభాగాల్లో 7 లక్షల 75వేల మందిని సూపర్ స్ప్రెడర్‌లుగా గుర్తించిన సర్కారు... వారికి ఈనెల 28 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే జూన్‌ 30 నాటికి రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

సూపర్‌ స్ప్రెడర్లు
సూపర్‌ స్ప్రెడర్లు
సూపర్‌ స్ప్రెడర్లకు టీకా.. కసరత్తు ప్రారంభించిన సర్కారు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పునఃప్రారంభమైన తర్వాత కేవలం రెండో డోసు వారికే టీకా వేస్తున్నారు. తొలిడోసును మొదటగా సూపర్ స్ప్రెడర్లకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిత్యం వందలమందిని కలిసే పౌర సరఫరాల శాఖ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు, ఫర్టిలైజర్ దుకాణదారులు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, ఇతర దుకాణాల్లో పనిచేసే వారిని సూపర్ స్ప్రెడర్ కేటగిరీలో చేర్చారు. ఆయా విభాగాల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7లక్షల 75 వేల మంది ఉన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ వద్ద 6.18 లక్షల కొవిషీల్డ్, 3.35లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండగా... కొవాగ్జిన్ మొదటి డోసు తీసుకున్న 3 లక్షల మందికి ఈ నెలాఖరు నాటికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. జూన్ మొదటి వారంలో మరిన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఈనెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్‌లకు వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

28 నుంచి 30 లోపు..
సూపర్ స్ప్రెడర్లలో మొదటి గ్రూపుగా భావిస్తున్న పౌరసరఫరాలశాఖలో మొత్తం 85,031మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో రేషన్‌ దుకాణాదారులు 33,980మంది... ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది కలిపి 49,616మంది, ఎఫ్​సీఐ సిబ్బంది 1,435 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల్లో పనిచేస్తున్న 30వేల మందికి, 20వేల మంది జర్నలిస్టులకు ఈనెల 28 నుంచి 30 లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు.

రాజధానిలో..

ఇక జీహెచ్​ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లు 3లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. వీరి వివరాలను సేకరించి వ్యాక్సినేషన్ నిర్వహించే బాధ్యతను పోలీసు, రవాణా శాఖలకు అప్పగించినట్లు తెలిపింది. ఇక గ్రేటర్​లో రైతు బజార్లలో కూరగాయలు అమ్మేవారు, పూలు, పండ్ల దుకాణాల నిర్వహకులు, సిబ్బంది, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, కిరణా దుకాణాల వారు, మాంసం వ్యాపారులు సహా ఇతరత్రా చిన్న వ్యాపారులు, సిబ్బంది కలిపి సుమారు 3లక్షల మందిని గుర్తించారు. వారందరికీ జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో 15రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని నిర్ణయించారు

సూపర్ స్ప్రెడర్లకు నెలరోజుల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్​వోలకు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని... నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే జూన్‌ 30 నాటికి వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తుందని భావిస్తోంది.

సంబంధిత కథనం: corona: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్‌

సూపర్‌ స్ప్రెడర్లకు టీకా.. కసరత్తు ప్రారంభించిన సర్కారు

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పునఃప్రారంభమైన తర్వాత కేవలం రెండో డోసు వారికే టీకా వేస్తున్నారు. తొలిడోసును మొదటగా సూపర్ స్ప్రెడర్లకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిత్యం వందలమందిని కలిసే పౌర సరఫరాల శాఖ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు, ఫర్టిలైజర్ దుకాణదారులు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, ఇతర దుకాణాల్లో పనిచేసే వారిని సూపర్ స్ప్రెడర్ కేటగిరీలో చేర్చారు. ఆయా విభాగాల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7లక్షల 75 వేల మంది ఉన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ వద్ద 6.18 లక్షల కొవిషీల్డ్, 3.35లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండగా... కొవాగ్జిన్ మొదటి డోసు తీసుకున్న 3 లక్షల మందికి ఈ నెలాఖరు నాటికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. జూన్ మొదటి వారంలో మరిన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఈనెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్‌లకు వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

28 నుంచి 30 లోపు..
సూపర్ స్ప్రెడర్లలో మొదటి గ్రూపుగా భావిస్తున్న పౌరసరఫరాలశాఖలో మొత్తం 85,031మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో రేషన్‌ దుకాణాదారులు 33,980మంది... ఎల్​పీజీ డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది కలిపి 49,616మంది, ఎఫ్​సీఐ సిబ్బంది 1,435 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల్లో పనిచేస్తున్న 30వేల మందికి, 20వేల మంది జర్నలిస్టులకు ఈనెల 28 నుంచి 30 లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు.

రాజధానిలో..

ఇక జీహెచ్​ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లు 3లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. వీరి వివరాలను సేకరించి వ్యాక్సినేషన్ నిర్వహించే బాధ్యతను పోలీసు, రవాణా శాఖలకు అప్పగించినట్లు తెలిపింది. ఇక గ్రేటర్​లో రైతు బజార్లలో కూరగాయలు అమ్మేవారు, పూలు, పండ్ల దుకాణాల నిర్వహకులు, సిబ్బంది, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, కిరణా దుకాణాల వారు, మాంసం వ్యాపారులు సహా ఇతరత్రా చిన్న వ్యాపారులు, సిబ్బంది కలిపి సుమారు 3లక్షల మందిని గుర్తించారు. వారందరికీ జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో 15రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని నిర్ణయించారు

సూపర్ స్ప్రెడర్లకు నెలరోజుల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్​వోలకు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని... నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే జూన్‌ 30 నాటికి వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తుందని భావిస్తోంది.

సంబంధిత కథనం: corona: ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు చేస్తున్నాం: డీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.