ETV Bharat / city

సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

author img

By

Published : Sep 5, 2020, 4:29 PM IST

Updated : Sep 5, 2020, 5:40 PM IST

సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం
సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

16:28 September 05

సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం
సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

సులభతర వాణిజ్యం విభాగంలో తెలంగాణకు మూడో స్థానం దక్కింది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఏపీ నిలవగా.. రెండో స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ఆక్రమించింది. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఝార్ఖండ్‌, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి. గతంలో 12 స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందుంది.

పారిశ్రామికోత్పత్తే లక్ష్యం..

ఈ సందర్భంగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచిన ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ అభినందనలు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వేశాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లలో అదనంగా రూ.20లక్షల కోట్ల పారిశ్రామికోత్పత్తే లక్ష్యమన్నారు. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని చెప్పారు. వన్‌ ప్రొడక్ట్‌ - వన్‌ డిస్ట్రిక్ట్‌ కార్యక్రమంపై రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లా స్వయం సమృద్ధి సాధించాలనేదే కేంద్రం లక్ష్యమన్నారు. ప్రతి జిల్లా తమ వనరుల మేరకు సొంత ఉత్పత్తులపైనే దృష్టిపెట్టాలని సూచించారు. సులభతర వాణిజ్యంలో ఐదేళ్లలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిదని చెప్పారు. సహకారం అందిస్తూ పోటీతత్వం పెంచడం ద్వారా పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ చర్యలతో 2025 నాటికి 5 ట్రిలియన్‌డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరతామని చెప్పారు.  

మరింత సులభతరం..

నిర్మాణ రంగంలో ఆన్‌లైన్‌ అనుమతులు మరింత సులభతరం చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ అన్నారు. నిర్మాణ రంగంలో 2057 పట్టణాల్లో ఆన్‌లైన్‌ అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. సుభతర వాణిజ్యంలో 2017లో 185వ స్థానంలో ఉన్నామనీ.. 2020 నాటికి 158 స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి చేరుకున్నట్టు ఆయన తెలిపారు. 

ఇవీ చూడండి: ఫోన్ నుంచి పొలంలో 'ఇస్మార్ట్ వ్యవసాయం'!

16:28 September 05

సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం
సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానికి మూడో స్థానం

సులభతర వాణిజ్యం విభాగంలో తెలంగాణకు మూడో స్థానం దక్కింది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఏపీ నిలవగా.. రెండో స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ఆక్రమించింది. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఝార్ఖండ్‌, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి. గతంలో 12 స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందుంది.

పారిశ్రామికోత్పత్తే లక్ష్యం..

ఈ సందర్భంగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచిన ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ అభినందనలు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వేశాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లలో అదనంగా రూ.20లక్షల కోట్ల పారిశ్రామికోత్పత్తే లక్ష్యమన్నారు. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని చెప్పారు. వన్‌ ప్రొడక్ట్‌ - వన్‌ డిస్ట్రిక్ట్‌ కార్యక్రమంపై రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లా స్వయం సమృద్ధి సాధించాలనేదే కేంద్రం లక్ష్యమన్నారు. ప్రతి జిల్లా తమ వనరుల మేరకు సొంత ఉత్పత్తులపైనే దృష్టిపెట్టాలని సూచించారు. సులభతర వాణిజ్యంలో ఐదేళ్లలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిదని చెప్పారు. సహకారం అందిస్తూ పోటీతత్వం పెంచడం ద్వారా పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ చర్యలతో 2025 నాటికి 5 ట్రిలియన్‌డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరతామని చెప్పారు.  

మరింత సులభతరం..

నిర్మాణ రంగంలో ఆన్‌లైన్‌ అనుమతులు మరింత సులభతరం చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ అన్నారు. నిర్మాణ రంగంలో 2057 పట్టణాల్లో ఆన్‌లైన్‌ అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. సుభతర వాణిజ్యంలో 2017లో 185వ స్థానంలో ఉన్నామనీ.. 2020 నాటికి 158 స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి చేరుకున్నట్టు ఆయన తెలిపారు. 

ఇవీ చూడండి: ఫోన్ నుంచి పొలంలో 'ఇస్మార్ట్ వ్యవసాయం'!

Last Updated : Sep 5, 2020, 5:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.