ETV Bharat / city

'షర్మిల పార్టీకి జగన్​ మద్దతు ఉందా..? లేదా..?'

author img

By

Published : Jul 9, 2022, 5:18 PM IST

TDP on Plenary: వైకాపా ప్రీనరీ సమావేశాలపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మతాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు ఉందో ? లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

TDP on Plenary
నక్కా ఆనంద్ బాబు

'షర్మిల పార్టీకి జగన్​ మద్దతు ఉందా..? లేదా..?'

TDP criticism on YCP Plenary: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుతున్న వైకాపా ప్రీనరీపై తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు. తన రాజకీయ అవసరాల కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మూడేళ్లలో చేసిందేమీ లేదు కాబట్టే విపక్షాల్ని తిట్టడానికి ప్లీనరీ పెట్టారని ఎద్దేవా చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విపక్షాలను తిట్టేందుకే ప్లీనరీ: నక్కా ఆనంద్ బాబు

అమ్మను, చెల్లిని రాజకీయం కోసం వాడుకున్నారనేది యధార్థం. వాళ్ల చెల్లి పార్టీకి ఈయన మద్దతుందా లేదా? అంటే ప్రజలకు ఏం తెలియదనుకుంటున్నారా? అంటే ఈ పార్టీని ఆమె వ్యతిరేకిస్తోందా? ఎవరైనా ఏ మతమైనా ఆచరించొచ్చు. కానీ నువ్వు ఏ మతమో చెప్పు. తల్లిని, చెల్లికి బైబిల్ ఇచ్చి పంపుతావ్. ఈయనేమో గంగానదిలో మునుగుతాడు.- నక్కా ఆనంద్‌ బాబు, మాజీమంత్రి

మతాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న జగన్.. ప్రతిపక్షాలకు మతం అంటగట్టడం సరికాదన్నారు. తల్లి, చెల్లికి బైబిల్ ఇచ్చి ప్రజల్లో తిప్పి.. తాను మాత్రం స్వామీజీల వద్ద గంగలో మునిగారు. అసలు జగన్ ఏ మతమో ఎప్పుడైనా చెప్పారా అని ఆనంద్​బాబు ప్రశ్నించారు. కొత్తగా జగన్​ తల్లి రాజీనామా చేయటం హస్యాస్పదమన్నారు. షర్మిల పెట్టిన పార్టీకి తన మద్దతు ఉందో లేదో జగన్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'షర్మిల పార్టీకి జగన్​ మద్దతు ఉందా..? లేదా..?'

TDP criticism on YCP Plenary: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుతున్న వైకాపా ప్రీనరీపై తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు. తన రాజకీయ అవసరాల కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మూడేళ్లలో చేసిందేమీ లేదు కాబట్టే విపక్షాల్ని తిట్టడానికి ప్లీనరీ పెట్టారని ఎద్దేవా చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విపక్షాలను తిట్టేందుకే ప్లీనరీ: నక్కా ఆనంద్ బాబు

అమ్మను, చెల్లిని రాజకీయం కోసం వాడుకున్నారనేది యధార్థం. వాళ్ల చెల్లి పార్టీకి ఈయన మద్దతుందా లేదా? అంటే ప్రజలకు ఏం తెలియదనుకుంటున్నారా? అంటే ఈ పార్టీని ఆమె వ్యతిరేకిస్తోందా? ఎవరైనా ఏ మతమైనా ఆచరించొచ్చు. కానీ నువ్వు ఏ మతమో చెప్పు. తల్లిని, చెల్లికి బైబిల్ ఇచ్చి పంపుతావ్. ఈయనేమో గంగానదిలో మునుగుతాడు.- నక్కా ఆనంద్‌ బాబు, మాజీమంత్రి

మతాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న జగన్.. ప్రతిపక్షాలకు మతం అంటగట్టడం సరికాదన్నారు. తల్లి, చెల్లికి బైబిల్ ఇచ్చి ప్రజల్లో తిప్పి.. తాను మాత్రం స్వామీజీల వద్ద గంగలో మునిగారు. అసలు జగన్ ఏ మతమో ఎప్పుడైనా చెప్పారా అని ఆనంద్​బాబు ప్రశ్నించారు. కొత్తగా జగన్​ తల్లి రాజీనామా చేయటం హస్యాస్పదమన్నారు. షర్మిల పెట్టిన పార్టీకి తన మద్దతు ఉందో లేదో జగన్ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.