ETV Bharat / city

ఎన్టీఆర్​ శతజయంతి వరకు భారతరత్న సాధిస్తాం: చంద్రబాబు

ఎన్టీఆర్​ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్​ ఒక స్ఫూర్తి అని... తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారన్నారు.

author img

By

Published : Jan 18, 2021, 10:54 AM IST

chandrababu pays tribute to ntr at ntr ghat
chandrababu pays tribute to ntr at ntr ghat

పేదల అభవృద్ధి కోసం ఎన్టీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. ఎన్టీఆర్​ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్​ సినీ రంగంలో రారాజుగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సేవల కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పరిపాలనలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. హైదరాబాద్​లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. తెదేపా హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని... జీనోమ్​ వ్యాలీ వల్ల భారత్​ బయోటెక్ సహా ఎన్నో కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. ఇప్పుడు భారత్​ బయోటెక్ కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసిందని చెప్పారు. ​

ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్​ చేశారు చంద్రబాబు. దేశ అత్యున్నత పురష్కారం వచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వరకు సాధిస్తామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్​ శతజయంతి వరకు భారతరత్న సాధిస్తాం: చంద్రబాబు

ఇదీ చదవండి : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ

పేదల అభవృద్ధి కోసం ఎన్టీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. ఎన్టీఆర్​ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్​ సినీ రంగంలో రారాజుగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సేవల కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పరిపాలనలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. హైదరాబాద్​లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. తెదేపా హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని... జీనోమ్​ వ్యాలీ వల్ల భారత్​ బయోటెక్ సహా ఎన్నో కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. ఇప్పుడు భారత్​ బయోటెక్ కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసిందని చెప్పారు. ​

ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్​ చేశారు చంద్రబాబు. దేశ అత్యున్నత పురష్కారం వచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వరకు సాధిస్తామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్​ శతజయంతి వరకు భారతరత్న సాధిస్తాం: చంద్రబాబు

ఇదీ చదవండి : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.