ETV Bharat / city

ఇంటర్​ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని

పరీక్షలో విఫలమైనంత మాత్రాన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ఇంటర్​లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని సికింద్రాబాద్​లో పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.

author img

By

Published : May 12, 2019, 2:28 PM IST

ఇంటర్​ విద్యార్థిని

ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రులు భరోసా కల్పిస్తున్నారు. సికింద్రాబాద్​లోని బన్సీలాల్​పేట్​లో ఇంటర్​లో ఫెయిలై బలవన్మరణానికి పాల్పడ్డ ​అనామిక కుటుంబాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పరామర్శించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. రాజకీయ పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

ఇంటర్​ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్​

ఇదీ చూడండి : పోలీస్​ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి

ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రులు భరోసా కల్పిస్తున్నారు. సికింద్రాబాద్​లోని బన్సీలాల్​పేట్​లో ఇంటర్​లో ఫెయిలై బలవన్మరణానికి పాల్పడ్డ ​అనామిక కుటుంబాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పరామర్శించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. రాజకీయ పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

ఇంటర్​ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్​

ఇదీ చూడండి : పోలీస్​ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.