ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

author img

By

Published : Aug 26, 2020, 3:10 PM IST

Updated : Aug 26, 2020, 4:48 PM IST

విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

15:06 August 26

విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

    తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ధర్మాధికారి కమిటీ తుది నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు వేసిన పిటిషన్​పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. స్థానికత లేని 586 మందిని రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఉద్యోగులను కేటాయించి వివాదానికి తెరలేపారని వాదనలు వినిపించాయి.  

   ఈ వాదనపై ఏపీ విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. తమను రిలీవ్ చేసి ఏపీ విద్యుత్ సంస్థలు జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలు విన్న సుప్రీం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వీటిపై స్పందించడానికి రెండు వారాల గడువు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.

ఇవీ చూడండి: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

15:06 August 26

విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

    తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ధర్మాధికారి కమిటీ తుది నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు వేసిన పిటిషన్​పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. స్థానికత లేని 586 మందిని రాష్ట్రానికి కేటాయించడంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఉద్యోగులను కేటాయించి వివాదానికి తెరలేపారని వాదనలు వినిపించాయి.  

   ఈ వాదనపై ఏపీ విద్యుత్ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. తమను రిలీవ్ చేసి ఏపీ విద్యుత్ సంస్థలు జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలు విన్న సుప్రీం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వీటిపై స్పందించడానికి రెండు వారాల గడువు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.

ఇవీ చూడండి: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Last Updated : Aug 26, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.