ETV Bharat / city

భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ ప్రయోగాలు ఇలా

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫార్మా రంగ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్... కొవాగ్జిన్​ను రూపొందించింది. కొవాగ్జిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దిగ్విజయంగా సాగుతున్నాయి. దేశంలోనే అత్యధిక మందిపై మొట్టమొదటిసారి కొవిడ్ టీకా ప్రయోగాలు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోదీ ఇవాళ సందర్శిస్తున్నారు.

author img

By

Published : Nov 28, 2020, 7:32 AM IST

Updated : Nov 28, 2020, 10:09 AM IST

covaxin
covaxin

కరోనా మహమ్మారి... ప్రపంచదేశాలను వణికిస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. వైరస్​ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే పరిష్కారమని ప్రపంచమంతా అని భావిస్తున్న సమయంలో భారత్​లో ఇండిజినిస్ వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చిన భారత్ బయోటెక్... కొవాగ్జిన్ కాండీడ్​ను రూపొందించింది. ఎన్ఐఎన్, ఐసీఎంఆర్​తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేస్తోంది. కొవాగ్జిన్ కాండీడ్​ను ముందుగా రీసస్ కోతులపై ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు సాధించింది. మనషులపై ప్రయోగాలకు భారత్ ఔషధ నియంత్రణ మండలి... భారత్ బయోటెక్​కు అనుమతులు జారీ చేసింది.

26వేల మందిపై మూడో దశ ట్రయల్​

ఈ ఏడాది.. జులైలో మొదటి సారి దేశ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో... 375 మందిపై తొలివిడత ప్రయోగాలు నిర్వహించారు. 14 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ఇచ్చిన వ్యాక్సిన్ డోస్ సత్ఫలితాలు ఇచ్చినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. అనంతరం సెప్టెంబర్​లో 750 మందిపై నిర్వహించిన రెండో దఫా ట్రాయల్స్ కూడా సత్ఫలితాలను ఇవ్వడంతో... ఈ నెల మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో... 26 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది భారత్ బయోటెక్.

ఆ దేశాలు మినహా టీకా సరఫరాకు హక్కులు

కొవాగ్జిన్​తో పాటు నాజర్ స్ప్రే, మోనోక్లోనల్ యాంటీ బాడీస్ థెరపుటిక్స్ తయారీపై పరిశోధనలు చేస్తోంది భారత్ బయోటెక్. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్​తో ఒప్పందం చేసుకుంది. అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో టీకా సరఫరా హక్కులు సాధించింది. చింపాంజీ.. అడినో వైరస్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. న్యూ మిలినియం టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రీ డొమిక్స్ సంస్థలతో కలిసి... కొవిడ్​పై అత్యంత ప్రభావవంతంగా పనిచేసే... హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీ బాడీలను తయారు చేస్తోంది. ఫలితంగా కొవిడ్​ను ఎదుర్కోవడం కోసం కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్​లపై ప్రయోగాలు చేస్తోంది.

భారత్​ బయోటెక్​లో గంట సేపు మోదీ

కొవిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ... భారీ స్థాయిలో మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్​ను ప్రధాని మోదీ ఇవాళ సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా టీకా తయారిపై శాస్త్రవేత్తలతో చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు గంట సేపు ప్రధాని భారత్ బయోటెక్​లో గడపనునట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను సంస్థ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి : ఇవాళ హైదరాబాద్​ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

కరోనా మహమ్మారి... ప్రపంచదేశాలను వణికిస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. వైరస్​ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే పరిష్కారమని ప్రపంచమంతా అని భావిస్తున్న సమయంలో భారత్​లో ఇండిజినిస్ వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చిన భారత్ బయోటెక్... కొవాగ్జిన్ కాండీడ్​ను రూపొందించింది. ఎన్ఐఎన్, ఐసీఎంఆర్​తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేస్తోంది. కొవాగ్జిన్ కాండీడ్​ను ముందుగా రీసస్ కోతులపై ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు సాధించింది. మనషులపై ప్రయోగాలకు భారత్ ఔషధ నియంత్రణ మండలి... భారత్ బయోటెక్​కు అనుమతులు జారీ చేసింది.

26వేల మందిపై మూడో దశ ట్రయల్​

ఈ ఏడాది.. జులైలో మొదటి సారి దేశ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో... 375 మందిపై తొలివిడత ప్రయోగాలు నిర్వహించారు. 14 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ఇచ్చిన వ్యాక్సిన్ డోస్ సత్ఫలితాలు ఇచ్చినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. అనంతరం సెప్టెంబర్​లో 750 మందిపై నిర్వహించిన రెండో దఫా ట్రాయల్స్ కూడా సత్ఫలితాలను ఇవ్వడంతో... ఈ నెల మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో... 26 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది భారత్ బయోటెక్.

ఆ దేశాలు మినహా టీకా సరఫరాకు హక్కులు

కొవాగ్జిన్​తో పాటు నాజర్ స్ప్రే, మోనోక్లోనల్ యాంటీ బాడీస్ థెరపుటిక్స్ తయారీపై పరిశోధనలు చేస్తోంది భారత్ బయోటెక్. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్​తో ఒప్పందం చేసుకుంది. అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో టీకా సరఫరా హక్కులు సాధించింది. చింపాంజీ.. అడినో వైరస్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. న్యూ మిలినియం టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రీ డొమిక్స్ సంస్థలతో కలిసి... కొవిడ్​పై అత్యంత ప్రభావవంతంగా పనిచేసే... హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీ బాడీలను తయారు చేస్తోంది. ఫలితంగా కొవిడ్​ను ఎదుర్కోవడం కోసం కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్​లపై ప్రయోగాలు చేస్తోంది.

భారత్​ బయోటెక్​లో గంట సేపు మోదీ

కొవిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ... భారీ స్థాయిలో మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్​ను ప్రధాని మోదీ ఇవాళ సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా టీకా తయారిపై శాస్త్రవేత్తలతో చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు గంట సేపు ప్రధాని భారత్ బయోటెక్​లో గడపనునట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను సంస్థ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి : ఇవాళ హైదరాబాద్​ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Last Updated : Nov 28, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.