ETV Bharat / city

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న మధ్యంతర ఆదేశాలు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మంత్రివర్గం నిర్ణయం గవర్నర్ ఆమోదించి.. జీవో విడుదలయ్యే వరకు.. న్యాయ సమీక్ష జరపవద్దని ప్రభుత్వం వాదించింది. సమ్మె నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనకు దురుద్దేశాలున్నాయని పిటిషనర్ వాదించారు.

author img

By

Published : Nov 20, 2019, 10:03 PM IST

Updated : Nov 20, 2019, 11:42 PM IST

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులను శుక్రవారం వరకు హైకోర్టు పొడిగించింది. రూట్ల ప్రైవేటీకరణ అత్యవసరంగా చేయాల్సి ఉందని... మధ్యంతర ఉత్తర్వుల కారణంగా తదుపరి చర్యలు చేపట్టలేక పోతున్నామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఏజీ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. శుక్రవారం వాదనలు పూర్తి చేస్తే... అదే రోజున తుది తీర్పు వెల్లడిస్తామని.. అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

అంతర్గత మార్పిడి ఎలా అవుతుంది
మంత్రివర్గ నిర్ణయంపై సమీక్ష జరిపే అధికారం కోర్టులకు ఉండదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత.. దానికి అనుగుణంగా జీవో విడుదలయ్యాక.. సవాల్ చేయవచ్చునన్నారు. ప్రస్తుత దశలో న్యాయసమీక్ష జరపవద్దని కోరారు. తన వాదనకు మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు. శాఖల మధ్య పరస్పర సమాచార మార్పిడిపై న్యాయ సమీక్ష జరపరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రివర్గం నిర్ణయం... శాఖల మధ్య అంతర్గత సమాచార మార్పడి ఎలా అవుతుందని ప్రశ్నించింది.

కేబినెట్ నిర్ణయం వెనక దురుద్దేశం ఉంది
కేబినెట్ నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని.. వేల మంది ఆర్టీసీ కార్మికులపై ప్రభావం చూపనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదన కొనసాగించారు. సహజ వనరులను ప్రైవేట్ పరం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో తెలిపిందని వాదించారు. రూట్ల సహజ వనరుల కావన్న హైకోర్టు... సంబంధం లేని విధంగా వాదించవద్దని అసహనం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో కార్మికులు విధుల్లో చేరకపోతే రూట్లు ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారని.. కాబట్టి కేబినెట్ నిర్ణయం వెనక దురుద్దేశాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు. తన వాదనకు మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు.

ఇదీ చదవండి: బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'

రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులను శుక్రవారం వరకు హైకోర్టు పొడిగించింది. రూట్ల ప్రైవేటీకరణ అత్యవసరంగా చేయాల్సి ఉందని... మధ్యంతర ఉత్తర్వుల కారణంగా తదుపరి చర్యలు చేపట్టలేక పోతున్నామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఏజీ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. శుక్రవారం వాదనలు పూర్తి చేస్తే... అదే రోజున తుది తీర్పు వెల్లడిస్తామని.. అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

అంతర్గత మార్పిడి ఎలా అవుతుంది
మంత్రివర్గ నిర్ణయంపై సమీక్ష జరిపే అధికారం కోర్టులకు ఉండదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత.. దానికి అనుగుణంగా జీవో విడుదలయ్యాక.. సవాల్ చేయవచ్చునన్నారు. ప్రస్తుత దశలో న్యాయసమీక్ష జరపవద్దని కోరారు. తన వాదనకు మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు. శాఖల మధ్య పరస్పర సమాచార మార్పిడిపై న్యాయ సమీక్ష జరపరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రివర్గం నిర్ణయం... శాఖల మధ్య అంతర్గత సమాచార మార్పడి ఎలా అవుతుందని ప్రశ్నించింది.

కేబినెట్ నిర్ణయం వెనక దురుద్దేశం ఉంది
కేబినెట్ నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని.. వేల మంది ఆర్టీసీ కార్మికులపై ప్రభావం చూపనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదన కొనసాగించారు. సహజ వనరులను ప్రైవేట్ పరం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో తెలిపిందని వాదించారు. రూట్ల సహజ వనరుల కావన్న హైకోర్టు... సంబంధం లేని విధంగా వాదించవద్దని అసహనం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో కార్మికులు విధుల్లో చేరకపోతే రూట్లు ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారని.. కాబట్టి కేబినెట్ నిర్ణయం వెనక దురుద్దేశాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు. తన వాదనకు మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు.

ఇదీ చదవండి: బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'

TG_HYD_01_21_RTC_JAC_SAMME_IMPARTENT_ANOUNCEMENT_AB_3182388 reporter : sripathi.srinivas Note : TG_HYD_52_20_RTC_SAMME_AB_3182388 ఫీడ్ వాడుకోగలరు. ( ) ఎలాంటి షరుతులు లేకుండా విధుల్లోకి ఆహ్వానిస్తే..ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నారని ఐకాస కన్వీనర్ అశ్వద్దామరెడ్డి స్పష్టం చేశారు. ఆదిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిస్తున్నామన్నారు. విద్యానగర్ లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అశ్వద్దామరెడ్డి ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన చేశారు. హైకోర్టు జేఏసీ నోటీసులో ఇచ్చిన సమ్మె అంశాలను లేబర్ కమీషనర్ కు నివేదించడానికి నిర్ణయం తీసుకునేందుకు రెండు వారాలు గడువు ఇచ్చిందని ఆయన తెలిపారు. కాబట్టి ప్రభుత్వం సత్వరమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను లేబర్ కోర్టుకు నివేదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని..కార్మికుల సమ్మె ఉద్దేశ్యం సమస్యల పరిష్కారానికే తప్ప విధులను విడిచిపెట్టడం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉదాహరణగా చూపిందని ఐకాస నేతలు పేర్కొన్నారు. కాబట్టి సమ్మెకు ముందు ఉన్న పరిస్థితులను కల్పించి కార్మికులపై ఎలాంటి షరతులు లేకుండా విధులను నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం కల్పించినచో సమ్మెను విరమించి కార్మికులు విధులలో చేరుతారని జేఏసీ నేతలు వివరించారు. అప్పటి వరకు సమ్మె యధావిధంగా కొనసాగుతుందని అశ్వద్దామరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆర్టీసీ సమ్మె సుధీర్ఘమైన సమ్మె అని ఆయన అభివర్ణించారు. Look... బైట్ : అశ్వద్దామరెడ్డి, జేఏసీ కన్వీనర్.
Last Updated : Nov 20, 2019, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.