ETV Bharat / city

వీడియో వైరల్: కరోనా బాధితులపై ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం - santhiram hospital viral video

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో కరోనా బాధితులు ఆందోళన నిర్వహించారు. రోగులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిరోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయపడుతున్నారు.

staff-do-not-care-for-corona-victims-at-nadyala-santhiram-hospital-at-kurnool-district
వీడియో వైరల్: కరోనా బాధితులను పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది
author img

By

Published : Jul 27, 2020, 7:41 PM IST

వీడియో వైరల్: కరోనా బాధితులను పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో కరోనా బాధితులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పట్టించుకోవడం లేదని సిబ్బందితో గొడవ పడ్డారు. వైద్యశాలలో జరుగుతున్న సంఘటనలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

బాధితులను ఎక్కువగా వైద్యశాలకు తరలిస్తుండటం.. అందరికీ సరిపడా సౌకర్యాలు కల్పించలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతుండటం విశేషం. వారం రోజుల క్రితం ఇదే వైద్యశాలలో బాధితులు పడిన కష్టాలను వీడియో తీసి సామాజిక మద్యమాల్లో ఉంచడం వల్ల వీడియో వైరల్ అయ్యింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో సంఘటన చోటు చేసుకోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.

ఇవీ చూడండి : తుది దశకు సచివాలయ భవనాల కూల్చివేత

వీడియో వైరల్: కరోనా బాధితులను పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాలలో కరోనా బాధితులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పట్టించుకోవడం లేదని సిబ్బందితో గొడవ పడ్డారు. వైద్యశాలలో జరుగుతున్న సంఘటనలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

బాధితులను ఎక్కువగా వైద్యశాలకు తరలిస్తుండటం.. అందరికీ సరిపడా సౌకర్యాలు కల్పించలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతుండటం విశేషం. వారం రోజుల క్రితం ఇదే వైద్యశాలలో బాధితులు పడిన కష్టాలను వీడియో తీసి సామాజిక మద్యమాల్లో ఉంచడం వల్ల వీడియో వైరల్ అయ్యింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో సంఘటన చోటు చేసుకోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.

ఇవీ చూడండి : తుది దశకు సచివాలయ భవనాల కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.