ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన 450 పేద కుటుంబాలకు దుప్పట్లు, టవళ్లు, సబ్బులు పంపిణీ చేశారు. కారం పల్లి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు మన్నూరు అశ్వత్థామ రెడ్డి, తేజమూర్తి రెడ్డి, భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కడప జిల్లా రాజంపేట మండలం పుల్ల పుత్తూరు గ్రామం (help to Flood victims at Pulla Puthur)లో జరిగింది.
వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తమ అమ్మ, నాన్న పేర్ల మీదుగా పంపిణీ చేశామని వారు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా బాధిత కుటుంబాలు ఉంటే వారికీ తక్షణ సాయం అందిస్తామంటూ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో కారం పల్లి సుబ్బారెడ్డి మనవరాలు మన్నూరు ఇందు శ్రీ, తోపు గుంట శ్రీను, వెంపటి రమణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ ఉద్దేశం, త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'