ETV Bharat / city

రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్​డౌన్.. పలుచోట్ల నిబంధనల ఉల్లంఘన

author img

By

Published : May 17, 2021, 12:15 PM IST

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు ఆరో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.

telangana lockdown, telangana lockdown updates,telangana lockdown  news
తెలంగాణ లాక్​డౌన్, తెలంగాణ లాక్​డౌన్ అప్​డేట్స్, తెలంగాణ లాక్​డౌన్ న్యూస్

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఆరో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్‌ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.

ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఆరో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్‌ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.

ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.