ETV Bharat / city

Samantha Defamation Suit: సమంత పరువు నష్టం పిటిషన్‌పై తీర్పు నేడే

author img

By

Published : Oct 25, 2021, 5:34 PM IST

సినీ నటి సమంత పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో ఇవాళ తీర్పు వెలువడనుంది. వైద్యుడు సీఎల్​ వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై... సమంత పరువునష్టం దావా దాఖలు చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుని కోరారు.

Samantha Defamation Suit updates
Samantha Defamation Suit updates

తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న సినీ నటి సమంత... పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది(Samantha Defamation Suit updates). సమంత పిటిషన్​ను విచారణకు స్వీకరించిన కూకట్‌పల్లి కోర్టు... నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్‌ను వేయవచ్చన్న న్యాయవాది బాలాజీ వాదనతో ఏకీభవించింది. వైద్యుడు సీఎల్​ వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై... నటి సమంత పరువునష్టం దావా దాఖలు చేశారు.

ఇదీ జరిగింది..

సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నటి సమంత (Samantha Defamation Suit) కోర్టుకెక్కారు. హైదరాబాద్​ కూకట్​పల్లి కోర్టు(Kukarpally Court)లో పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్​పల్లి కోర్టులో పరువునష్టం దావా (Samantha Defamation Suit) దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్​లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు.

మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును సమంత కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని... పరువునష్టం ఎంతనేది తర్వాత కోరతానన్నారు. ఇక నుంచి తనపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సమంత కోరారు.

పిటిషన్ రిటర్న్...

పరువు నష్టం దావా (Samantha Defamation Suit) కేసులో ప్రతివాదులకు నోటీసులు పంపించని కారణంగా పిటిషన్​ను కూకట్​పల్లి కోర్టు రిటర్న్ (Petition Return) చేసింది. ప్రతివాదులకు నోటీసులు పంపించకుండా కేసు ఫైల్ చేయవచ్చని సమంత తరఫు అడ్వొకేట్ బాలాజీ వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి: Samantha Defamation Suit updates: సమంత పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో ఇవాళ ఏం జరిగిందంటే..

తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న సినీ నటి సమంత... పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది(Samantha Defamation Suit updates). సమంత పిటిషన్​ను విచారణకు స్వీకరించిన కూకట్‌పల్లి కోర్టు... నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్‌ను వేయవచ్చన్న న్యాయవాది బాలాజీ వాదనతో ఏకీభవించింది. వైద్యుడు సీఎల్​ వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై... నటి సమంత పరువునష్టం దావా దాఖలు చేశారు.

ఇదీ జరిగింది..

సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నటి సమంత (Samantha Defamation Suit) కోర్టుకెక్కారు. హైదరాబాద్​ కూకట్​పల్లి కోర్టు(Kukarpally Court)లో పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్​పల్లి కోర్టులో పరువునష్టం దావా (Samantha Defamation Suit) దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్​లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు.

మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును సమంత కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని... పరువునష్టం ఎంతనేది తర్వాత కోరతానన్నారు. ఇక నుంచి తనపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సమంత కోరారు.

పిటిషన్ రిటర్న్...

పరువు నష్టం దావా (Samantha Defamation Suit) కేసులో ప్రతివాదులకు నోటీసులు పంపించని కారణంగా పిటిషన్​ను కూకట్​పల్లి కోర్టు రిటర్న్ (Petition Return) చేసింది. ప్రతివాదులకు నోటీసులు పంపించకుండా కేసు ఫైల్ చేయవచ్చని సమంత తరఫు అడ్వొకేట్ బాలాజీ వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి: Samantha Defamation Suit updates: సమంత పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో ఇవాళ ఏం జరిగిందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.