ETV Bharat / city

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'లో చీకటి ఒప్పందాలు బయటకురావాలి: సబ్బం హరి

author img

By

Published : Feb 15, 2021, 3:36 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్​కు సబ్బం హరి సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, ఏపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఉక్కు పరిశ్రమ అంశంపై సీఎం జగన్ లేఖలు రాస్తే సరిపోదన్నారు. కేంద్రం ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటికి రావాలని డిమాండ్ చేశారు.

sabbam hari
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'లో చీకటి ఒప్పందాలు బయటకురావాలి: సబ్బం హరి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో జరిగిన చీకటి ఒప్పందాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖలో దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. పల్లా పోరాట పటిమను ప్రశంసించారు. ఉద్యమం మరింత ఉద్ధృతం కావాలన్న సబ్బం.. ఏపీ సీఎం జగన్​.. కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటికి రావాలి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పల్లా శ్రీనివాస్​కు అండగా ఉంటా. ఆయన ఆశయ సాధన కోసం నేను కూడా దీక్షలో కూర్చుంటా.

- సబ్బం హరి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో జరిగిన చీకటి ఒప్పందాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖలో దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. పల్లా పోరాట పటిమను ప్రశంసించారు. ఉద్యమం మరింత ఉద్ధృతం కావాలన్న సబ్బం.. ఏపీ సీఎం జగన్​.. కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటికి రావాలి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పల్లా శ్రీనివాస్​కు అండగా ఉంటా. ఆయన ఆశయ సాధన కోసం నేను కూడా దీక్షలో కూర్చుంటా.

- సబ్బం హరి

ఇవీచూడండి: హిందూస్థాన్ జింక్​నూ ఇలానే చంపేశారు..?

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.