ETV Bharat / city

అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు

author img

By

Published : Jan 1, 2021, 4:30 AM IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కింద అందిస్తున్న రైతు బంధు యాసంగి సీజన్ సంబంధించి​ ఇప్పటి వరకు రూ.4,079కోట్లు అన్నదాతల ఖాతాలో జమ చేశారు. ఈనెల 28 నుంచి నుంచి దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు.

అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు

యాసంగి సీజన్ రైతుబంధు సాయం కింద ఇప్పటి వరకు 2,955 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సీజన్​లో 60.88 లక్షల రైతులకు కోటి 49 లక్షల 50 వేల ఎకరాలకు రైతుబంధు కింద 7,474 కోట్ల 78 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి దశలవారీగా ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

గురువారం వరకు 48లక్షల 74వేల 545 మంది అన్నదాతలకు చెందిన 81.59లక్షల ఎకరాలకు సాయం అందించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. 4079 కోట్ల 48లక్షల 6వేల 836రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేసినట్లు చెప్పారు.

యాసంగి సీజన్ రైతుబంధు సాయం కింద ఇప్పటి వరకు 2,955 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సీజన్​లో 60.88 లక్షల రైతులకు కోటి 49 లక్షల 50 వేల ఎకరాలకు రైతుబంధు కింద 7,474 కోట్ల 78 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి దశలవారీగా ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

గురువారం వరకు 48లక్షల 74వేల 545 మంది అన్నదాతలకు చెందిన 81.59లక్షల ఎకరాలకు సాయం అందించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. 4079 కోట్ల 48లక్షల 6వేల 836రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: సాగుభూముల సందిగ్ధతలకు రెండు నెలల్లో పరిష్కారం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.