ETV Bharat / city

నాలుగోరోజు రైతుబంధు సాయం.. 6 లక్షలకు పైగా రైతులకు లబ్ధి

author img

By

Published : Dec 31, 2021, 6:48 PM IST

Rythu bandhu On Fourth Day: యాసంగి సీజన్​కు సంబంధించిన రైతుబంధు సాయం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నాలుగోరోజు 6 లక్షల 75 వేల 824 మంది రైతులకు నగదు సాయం అందింది. 1144.64 కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.

Rythu bandhu On Fourth Day
Rythu bandhu On Fourth Day

Rythu bandhu On Fourth Day: రాష్ట్రంలో నాలుగో రోజు రైతుబంధు పథకం కింద అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేశారు. 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. వీరితో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది కర్షకులకు రైతుబంధు నిధులు అందినట్టైంది. మొత్తం పెట్టుబడి సాయం 4246.68 కోట్ల రూపాయల పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిశీలించి సీజన్‌ ముందు రైతులకు సాగు చేయాల్సిన పంటల వివరాలు అందిస్తున్న నేపథ్యంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించిందని మంత్రి తెలిపారు. దానికి తగినట్లే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర పలుకుతుందన్నారు. తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని... దానికి అంతర్జాతీయ డిమాండ్ ఉందని వివరించారు. పప్పు, నూనెగింజల సాగు మరింత పెరగాలని సూచించారు. వ్యవసాయ రంగానికి దేశంలో ఏ ప్రభుత్వం అందించని సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

Rythu bandhu On Fourth Day: రాష్ట్రంలో నాలుగో రోజు రైతుబంధు పథకం కింద అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేశారు. 6 లక్షల 75 వేల 824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1144.64 కోట్ల రూపాయలు జమయ్యాయి. వీరితో కలిపి ఇప్పటి వరకు 52 లక్షల 71 వేల 91 మంది కర్షకులకు రైతుబంధు నిధులు అందినట్టైంది. మొత్తం పెట్టుబడి సాయం 4246.68 కోట్ల రూపాయల పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు. సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకు రావాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిశీలించి సీజన్‌ ముందు రైతులకు సాగు చేయాల్సిన పంటల వివరాలు అందిస్తున్న నేపథ్యంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించిందని మంత్రి తెలిపారు. దానికి తగినట్లే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర పలుకుతుందన్నారు. తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని... దానికి అంతర్జాతీయ డిమాండ్ ఉందని వివరించారు. పప్పు, నూనెగింజల సాగు మరింత పెరగాలని సూచించారు. వ్యవసాయ రంగానికి దేశంలో ఏ ప్రభుత్వం అందించని సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.