ఆర్టీసీ కార్గో-పార్శిల్ సేవల్లో రాష్ట్రం మరో అడుగు ముందుకేసిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇక నుంచి నేరుగా వినియోగదారుని ఇంటికే పార్శిళ్లు అందజేస్తామని తెలిపారు. ఖైరతాబాద్లో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన మంత్రి.. ఎలాంటి అదనపు భారం లేకుండా కార్గో-పార్శిల్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
డోర్-టూ-డోర్ సేవల కోసం 3 సంస్థలను ఎంపిక చేసిన అధికారులు.. నగరాన్ని 3 సెక్టార్లుగా విభజించి సేవలు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. కూకట్పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ సెంటర్లుగా చేసి ఏజెన్సీలకు అప్పగించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు కలెక్షన్ పాయింట్ల వద్దే ఉన్న సేవలను ఇప్పట్నుంచి ఇంటి వద్దకే అందించనున్నట్లు వెల్లడించారు.
డోర్ డెలివరీ సేవలతో ఆర్టీసీకి రోజుకు రూ.15 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పార్శిల్-కార్గో సేవలను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 12.5 లక్షల పార్శిళ్లను డెలివరీ చేసినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఎన్సీడీఈ సెంటర్ ప్రారంభించిన కిషన్ రెడ్డి