ETV Bharat / city

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ల్లో 100 మందితో ప్రత్యేక తనిఖీలు - railway protection force special drive at secunderabad rail station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశంలో వరుసగా పేలుడు పదార్థాలు లభించిన సందర్భంలో ముందస్తు తనిఖీలు చేపడుతున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

నిందితుల సమాచారమిస్తే త్వరగా పట్టుకోవడానికి వీలవుతుంది : ఆర్పీఎఫ్ పోలీసులు
author img

By

Published : Nov 3, 2019, 12:27 PM IST

పుణె, దిల్లీ రైల్వే స్టేషన్​లల్లో పేలుడు పదార్థాలు లభించిన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఐజీ రమేశ్ చంద్ర ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్టేషన్​లోని కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వేలో ప్రయాణికుల భద్రతే ధ్యేయమని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బిన్నయ్య తెలిపారు. రైల్వే స్టేషన్​లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆర్పీఎఫ్ పోలీసులు కోరారు. ప్రజలు, కూలీలు పోలీసులకు సహకారించాలన్నారు.

అన్ని శాఖల రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలంలోని ప్లాట్ ఫాంపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్​తో ప్రయాణికుల బ్యాగులను, వస్తువులను తనిఖీ చేశామని బిన్నయ్య తెలిపారు. స్టేషన్​లో పనిచేస్తున్న కూలీలకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని సూచించారు.

నిందితుల సమాచారమిస్తే త్వరగా పట్టుకోవడానికి వీలవుతుంది : ఆర్పీఎఫ్ పోలీసులు
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతథం: థామస్​రెడ్డి

పుణె, దిల్లీ రైల్వే స్టేషన్​లల్లో పేలుడు పదార్థాలు లభించిన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఐజీ రమేశ్ చంద్ర ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్టేషన్​లోని కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వేలో ప్రయాణికుల భద్రతే ధ్యేయమని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బిన్నయ్య తెలిపారు. రైల్వే స్టేషన్​లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆర్పీఎఫ్ పోలీసులు కోరారు. ప్రజలు, కూలీలు పోలీసులకు సహకారించాలన్నారు.

అన్ని శాఖల రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలంలోని ప్లాట్ ఫాంపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్​తో ప్రయాణికుల బ్యాగులను, వస్తువులను తనిఖీ చేశామని బిన్నయ్య తెలిపారు. స్టేషన్​లో పనిచేస్తున్న కూలీలకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని సూచించారు.

నిందితుల సమాచారమిస్తే త్వరగా పట్టుకోవడానికి వీలవుతుంది : ఆర్పీఎఫ్ పోలీసులు
ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతథం: థామస్​రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.