ETV Bharat / city

రేపట్నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు - telangana revenue employees jac president comments on security

వారం రోజులుగా ఆందోళన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు రేపట్నుంచి విధులకు హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్​, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు రవీంద్రరెడ్డి తెలిపారు.

రేపటి నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు
author img

By

Published : Nov 11, 2019, 9:02 PM IST

రేపట్నుంచి రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. వారం రోజులుగా చేస్తోన్న ఆందోళన విరమిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వంగ రవీంద్రరెడ్డి తెలిపారు. తమ కార్యాలయాలకు భద్రత కల్పించేందుకు అదనపు డీజీ జితేందర్​ హామీ ఇచ్చారన్నారు.

ఈనెల 4న సజీవ దహనానికి గురైన అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించాలని, డ్రైవర్​ గురునాథం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, అటెండర్​కు మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు రవీంద్రరెడ్డి తెలిపారు.

రేపట్నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు

ఇవీచూడండి: రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం

రేపట్నుంచి రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. వారం రోజులుగా చేస్తోన్న ఆందోళన విరమిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రెవెన్యూ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు వంగ రవీంద్రరెడ్డి తెలిపారు. తమ కార్యాలయాలకు భద్రత కల్పించేందుకు అదనపు డీజీ జితేందర్​ హామీ ఇచ్చారన్నారు.

ఈనెల 4న సజీవ దహనానికి గురైన అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి కుటుంబానికి తగిన పరిహారం ప్రకటించాలని, డ్రైవర్​ గురునాథం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, అటెండర్​కు మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు రవీంద్రరెడ్డి తెలిపారు.

రేపట్నుంచి విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు

ఇవీచూడండి: రైతులు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం

TG_HYD_59_11_REVENUE_JAC_PC_AB_3038066 REPORTER : Tirupal Reddy గమనిక: 3జి ద్వారా ఫీడ్‌ వచ్చింది. వాడుకోగలరు. ()తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు రేపటి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. గడిచిన 8 రోజులుగా నిర్వహిస్తున్నఆందోళనలను విరమిస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ ఐకాస అధ్యక్షుడు వంగ రవీంద్ర రెడ్డి వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని ఇవాళ సాయంత్రం సీసీఎల్‌ఎ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిందని, 15 రోజుల్లో పరిష్కరించేందుకు సోమేశ్‌కుమార్‌ హామీ ఇచ్చారని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులకు తగిన భద్రత కల్పించేందుకు అదనపు డీజీ జీతేందర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 4వ తేదీన సజీవదహనానికి గురైన అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని, డ్రైవర్‌ గురనాథం కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, గాయపడి చికిత్స పొందుతున్న అటెండర్‌కు మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు రవీంద్ర రెడ్డి వివరించారు. గడువు లోపల సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. బైట్: వంగ రవీంద్ర రెడ్డి, ట్రెసా అధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.