ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారన్న ఆరోపణలతో ఆరెస్ట్ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ నెల 28 వరకు ఏపీ సీఐడీ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సీఐడీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఎంపీ కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉంచవచ్చన్న కోర్టు... ఆయనకు వై-కేటగిరి భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది. రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై నివేదిక కోరిన కోర్టు... జీజీహెచ్, రమేశ్ ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్కు ఆదేశాలిచ్చింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరినట్లు లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు వచ్చిన తర్వాతే రిమాండ్పై నిర్ణయం ఉంటుందన్నారు. ఆస్పత్రిలో ఉండే సమయం కూడా రిమాండ్ గడువులోకే వస్తుందని వెల్లడించారు.