సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ విజయవాడ నుంచి పీలేరుకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. హైవేపై లారీ ఒక్కసారిగా రాంగ్ ట్రాక్లోకి రావటం వల్లే ప్రమాదం జరిగిందని కత్తి మహేశ్ కారు డ్రైవర్ సురేశ్ చెప్పారు. యాక్సిడెండ్ జరిగిన సమయంలో కత్తి మహేశ్ సీట్బెల్ట్ ధరించలేదని... అందువల్లే బలమైన గాయాలయ్యాయని ఆయన అన్నారు.
సీటు బెల్టు ధరించిన తనకు పెద్దగా గాయాలవలేదని, ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపిన సురేశ్.. ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేశ్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించామన్నారు. కన్ను దగ్గర పెద్ద గాయం అవడం వల్ల.. మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు.
కత్తి మహేశ్ వైద్యం కోసం ఏపీ సీఎం జగన్ సీఎంఆర్ఎఫ్ నుంచి 17లక్షలు మంజూరు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో నేడు అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఇదీ చూడండి: kathi mahesh: నేడు యర్రావారి పాలెంలో కత్తి మహేశ్ అంత్యక్రియలు