ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, కుమార్తె ఇందు.. దిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సీఎం జగన్ ప్రభుత్వం తమ తండ్రిని వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెట్టి హింసిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజద్రోహం కేసు మోపడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకొని.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: 'కేసీఆర్కు పేదల మీద ప్రేముంటే.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి'