ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని కృష్ణాపురం గ్రామం పంటపొలాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పొలం పనులు చేసుకుంటుండగా చెట్ల మధ్య కనిపించిన కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు. మరికొందరిని తీసుకువచ్చి దాన్ని హతమార్చారు.
కొండ చిలువ సుమారు 15 అడుగులు ఉంటుందని.. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఇంత భారీ చిలువను చూడలేదని రైతులు చెప్పారు. అయితే దాన్ని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని కొందరు వన్యప్రాణి ప్రేమికులు అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: పెట్టుబడి పేరిట గాలం.. రూ.14 లక్షలు మాయం